యాప్నగరం

క్లాస్ రూమ్‌లోనే విద్యార్థుల కొట్లాట: ఒకరి మృతి

భద్రాద్రి కొత్తగూడెంలోని పాఠశాలలో దారుణమైన సంఘటన జరిగింది.

TNN 27 Jan 2017, 6:22 pm
భద్రాద్రి కొత్తగూడెంలోని పాఠశాలలో దారుణమైన సంఘటన జరిగింది. ఆ జిల్లా చంద్రగొండ మండలం ప్రభుత్వ పాఠశాలలో తరగతిలోనే విద్యార్థి ప్రాణం పోవడం కలకలం రేపింది. స్కూల్లో పదోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు డస్టర్ విషయంలో గొడవ వచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి కొట్టుకునే దాకా వచ్చింది. ఒకరి మీద పిడిగుద్దులు గుద్దుకుంటూ, తన్నుకున్నారు. ఆ క్రమంలో కొన్ని సున్నిత మైన ప్రదేశాల్లో దెబ్బతాకి ఓ విద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలిపోయాడు. అతడిని తోటి విద్యార్థులు దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను చనిపోయాడు. ఆ విద్యార్థిని భానుప్రకాష్ గా గుర్తించారు పోలీసులు.
Samayam Telugu 10th class students fight one dead in bhadradri kotthagudem district
క్లాస్ రూమ్‌లోనే విద్యార్థుల కొట్లాట: ఒకరి మృతి


కాగా విషయం జిల్లా అంతా వ్యాపించడంతో విద్యాశాఖాధి కారి రంగంలోకి దిగి హెడ్మాస్టర్ ను, ఇన్ ఛార్జ్ హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేశారు. భాను ప్రకాష్ మరణానికి కారణమైన మరో విద్యార్థిని శిక్షించాలంటూ మృతుని బంధువులు, ఇతర విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు నిందిత విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.