యాప్నగరం

తల్లి తప్పుకు కూతురు బలి?

ఏ తప్పు చేయని ఓ చిన్నారిని సజీవ దహనం చేశారు కొందరు దుర్మార్గులు.

TNN 24 Apr 2017, 3:19 pm
ఏ తప్పు చేయని ఓ చిన్నారిని సజీవ దహనం చేశారు కొందరు దుర్మార్గులు. కాలకృత్యాలకు వెళ్లిన చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. బోధన్ మండలంలోని పెగడపల్లిలో ఈ దారుణం జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం... పెగడపల్లికి చెందిన పోశెట్టి, సావిత్రి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. ఏడాది క్రితం పోశెట్టి మరణించాడు. దీంతో సావిత్రే కుటుంబాన్ని మోస్తోంది. కాగా ఆమెకు గ్రామానికి చెందిన వ్యక్తితోనే వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. సావిత్రి కూతురు భాగ్యలక్ష్మికి పదకొండేళ్లు. ఆమె కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటికి దూరంగా వెళ్లింది. అక్కడ పొంచి ఉన్న ఓ వ్యక్తి బాలికపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. ఆమె అరుపులు విని తల్లి, ఇతరులు అక్కడికి పరిగెట్టారు. అప్పటికే దుండగుడు పారిపోయాడు.
Samayam Telugu 11 years old girl sets ablaze by miscreants in nizamabad dist
తల్లి తప్పుకు కూతురు బలి?


మంటలు ఆపి చిన్నారిని ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. బాలిక చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో తల్లి అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తే బాలికపై ఘోరానికి పాల్పడ్డాడని భావిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పారు. తల్లిపై కక్ష సాధించడానికే చిన్నారిని ఇలా చేశాడని... ఓ వ్యక్తిపై అనుమానం పడుతున్నారు. బాలిక ఆరోతరగతి చదువుతోంది. పోలీసులు అక్రమసంబంధం దిశగా విచారణ చేస్తున్నారు. అతి త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.