అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ను హెచ్ఐవీ, ఎయిడ్స్ భూతం భయపెడుతోంది. ప్రాణాంతక హెచ్ఐవీ వ్యాధి హైదరాబాద్తోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలోని హెచ్ఐవీ ఎయిడ్స్ బాధితుల్లో 33 శాతం మంది భాగ్యనగరంలోనే ఉన్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హెచ్ఐవీతో జీవిస్తోన్న వారి సంఖ్య గత ఏడాది ఏడు శాతం పెరగడం ఆందోళ కలిగిస్తోంది.
అధికారిక సమాచారం ప్రకారం.. తెలంగాణలో 2016లో కొత్తగా 11,846 హెచ్ఐవీ ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి 1 నాటికి రాష్ట్రంలో హెచ్ఐవీ సోకిన వారి సంఖ్య 1,73,398 మంది కాగా.. 2015లో 1,61,552 మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు తెలంగాణలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా వెయ్యికి పైగా కొత్త హెచ్ఐవీ ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయి. శృంగారం ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోందని అధికారిక సమాచారం వెల్లడించింది. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు సేకరించింది.
హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్లలో హెచ్ఐవీ ఎయిడ్స్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ మూడు సెంటర్లలో 55,319 మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల పేర్లు రిజిసర్ట్ అయ్యాయి. అత్యధికంగా ఉస్మానియాలో 28,807 మంది తమ పేరు నమోదు చేసుకున్నారు. తర్వాతి స్థానంలో 13,938 మందితో గాంధీ హాస్పిటల్ సెంటర్ ఉంది. చెస్ట్ హాస్పిటల్లో 12,574 మంది హెచ్ఐవీకి చికిత్స పొందుతున్నారు.
హెచ్ఐవీతో బాధపడుతున్న వారు హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఆ జిల్లాలో 14,361 మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. తర్వాతి స్థానాల్లో మహబూబ్నగర్ (13,911), నల్గొండ (13,745), వరంగల్ (12,936), సంగారెడ్డి (10,995), నిజామాబాద్ (10,726) ఉన్నాయి.
అధికారిక సమాచారం ప్రకారం.. తెలంగాణలో 2016లో కొత్తగా 11,846 హెచ్ఐవీ ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి 1 నాటికి రాష్ట్రంలో హెచ్ఐవీ సోకిన వారి సంఖ్య 1,73,398 మంది కాగా.. 2015లో 1,61,552 మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు తెలంగాణలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా వెయ్యికి పైగా కొత్త హెచ్ఐవీ ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయి. శృంగారం ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోందని అధికారిక సమాచారం వెల్లడించింది. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు సేకరించింది.
హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్లలో హెచ్ఐవీ ఎయిడ్స్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ మూడు సెంటర్లలో 55,319 మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల పేర్లు రిజిసర్ట్ అయ్యాయి. అత్యధికంగా ఉస్మానియాలో 28,807 మంది తమ పేరు నమోదు చేసుకున్నారు. తర్వాతి స్థానంలో 13,938 మందితో గాంధీ హాస్పిటల్ సెంటర్ ఉంది. చెస్ట్ హాస్పిటల్లో 12,574 మంది హెచ్ఐవీకి చికిత్స పొందుతున్నారు.
హెచ్ఐవీతో బాధపడుతున్న వారు హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఆ జిల్లాలో 14,361 మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. తర్వాతి స్థానాల్లో మహబూబ్నగర్ (13,911), నల్గొండ (13,745), వరంగల్ (12,936), సంగారెడ్డి (10,995), నిజామాబాద్ (10,726) ఉన్నాయి.