యాప్నగరం

భద్రాద్రిలో భారీ ఎన్‌కౌంటర్: 10 మంది మావోలు హతం!

తెలంగాణలో బాగా బలహీనపడి ఉనికి కోల్పోతున్న మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని శుక్రవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

TNN 2 Mar 2018, 2:52 pm
తెలంగాణలో బాగా బలహీనపడి ఉనికి కోల్పోతున్న మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని శుక్రవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రాది జిల్లా చర్ల సమీపంలోని తొండపాల్ అటవీ ప్రాంతం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో పదిమంది మావోలు హతమవగా, గ్రేహౌండ్స్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుల్స్‌ గాయపడ్డారు. మృతుల్లో మావోయిస్ అగ్రనేత హరిభూషణ్ ఉన్నట్టు సమాచారం. తెలంగాణ మావోయిస్ట్ సెక్రెటరీగా హరిభూషణ్ విధులు నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మావోల మృతదేహాలను భద్రచాలం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గాయపడిన పోలీసులను సైతం భద్రాచలం హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు, మావోలకు మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలానికి హెలీకాప్టర్లను తరలించారు. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో ఏకే 47 ఆయుధాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu 12 maoists killed in encounter in telangana forests
భద్రాద్రిలో భారీ ఎన్‌కౌంటర్: 10 మంది మావోలు హతం!


గత డిసెంబరులోనూ భద్రాద్రి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ మృతిచెందిన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి సమీపంలోని బోడు అటవీ ప్రాంతంలో నక్సల్స్ జాడను గుర్తించిన పోలీసులు, వారి కదలికలపై నిఘా ఉంచారు. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ కూంబింగ్ టీమ్ వారిపై కాల్పులకు దిగింది. దీంతో నక్సల్స్ కూడా ఎదురుకాల్పులకు దిగారు. అయితే పక్కా వ్యూహంతో వచ్చిన పోలీసులు కాల్పులకు తెగబడటంతో 8 మంది నక్సల్స్‌ను మట్టుబెట్టారు. వీరంతా ఇటీవల ఏర్పడిన చండ్ర పుల్లారెడ్డి దళ సభ్యులుగా పోలీసులు గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.