యాప్నగరం

ఎవరు గెలిచినా.. విజయోత్సవాల్లేవ్!

నంద్యాల ఉపఎన్నిక ఫలితం ప్రకటన తర్వాతి పరిణామాలపై పోలీసులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

TNN 28 Aug 2017, 8:10 am
నంద్యాల ఉపఎన్నిక ఫలితం ప్రకటన తర్వాతి పరిణామాలపై పోలీసులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి పోలింగ్ తర్వాత నంద్యాల టౌన్లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో... ఫలితం తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాల నేపథ్యంలో.. ముందస్తుగా నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని ఆంక్షలు విధించారు. నంద్యాల్లో 144 సెక్షన్ విధించారు. ఎక్కడా ప్రజలు గుంపులుగుంపులుగా ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు.
Samayam Telugu 144 section in nandyal securirty beefed up
ఎవరు గెలిచినా.. విజయోత్సవాల్లేవ్!


అంతే కాదు.. విజయోత్సవాలు, ర్యాలీలను నిషేధించారు. ఎవరు గెలిచినా.. రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకోవడం, విజేతలు ర్యాలీ నిర్వహించడం జరగకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నిక ఫలితం అనౌన్స్ చేసిన అనంతరం.. బాణసంచా పేల్చడానికి కూడా పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. సంబరాలు ఏవైనా.. శబ్దం బయటకు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

విజేతలు ర్యాలీలు, విజయోత్సవాలు నిర్వహిస్తే.. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని, గొడవలు చెలరేగవచ్చు అని స్పష్టం అవుతోంది. పోలింగ్ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి, టీడీపీ నేత అభిరుచి మధులు తమ తమ అనుచరులతో ఎదురుపడినప్పుడు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. పోలింగ్ తర్వాతే అలా ఉంటే.. ఫలితం తర్వాత మరేం జరుగుతుందో అనే ఆందోళన నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసులు భరోసా ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.