కడప: అవును.. ఆ అమ్మాయికి ఆమె మూడో భార్య!
కడప జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు. ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని పెద్దలకు తేల్చి చెప్పారు.
TNN 26 Dec 2017, 11:42 pm
సమాజ కట్టుబాట్లకు, సంప్రదాయానికి భిన్నంగా ఇద్దరు యువతులు పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు. ఆ మాటకొస్తే.. ప్రకృతి విరుద్ధ చర్యకు తెరతీసి తల్లిదండ్రులతో పాటు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అందులో ఓ యువతి ఇప్పటికే మరో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం.. వారి కుటుంబసభ్యులు వారించి తీసుకుపోవడం జరిగాయి. ఈ చోద్యం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దముడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన ఎలీసమ్మ, బాబు దంపతుల కుమార్తె మౌనిక (20) పదో తరగతి వరకు చదువుకుంది. కుటుంబ పోషణ భారం కావడంతో 9 నెలల కిందట పులివెందులలోని ఓ ప్రైవేటు టెక్స్టైల్ మిల్లులో పనికి కుదిరింది.
అదే మిల్లులో కాశిరెడ్డినాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన రమాదేవి (18) పనిచేస్తోంది. ఈ క్రమంలో వారిద్దరికీ పరిచయం పెరిగింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దీంతో కొన్ని నెలల కిందట వారిద్దరూ పెద్దలకు తెలియకుండా పులివెందులలో పెళ్లి చేసుకున్నారు.
క్రిస్మస్ పండగ కోసం మౌనికను తల్లిదండ్రులు ఇంటికి పిలిపించారు. ఇంటికి వచ్చిన ఆ యువతి ప్రవర్తనలో కుటుంబసభ్యులు మార్పు గమనించారు. పైగా ఆ యువతి రమాదేవినే కలవరిస్తూ ఉండటంతో ఫోన్ చేసి ఆమెను కూడా పిలిపించారు. ఇద్దరినీ పెద్దలు గట్టిగా ప్రశ్నించడంతో వివాహం చేసుకున్నామని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని చెప్పారు. యువతులిద్దరూ పెద్దల మాట వినకపోవడంతో మంగళవారం (డిసెంబర్ 26) జమ్మలమడుగు డీఎస్పీ కృష్ణణ్ను ఆశ్రయించారు.
డీఎస్పీ వారిని విచారించగా మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గతంలో రమాదేవి.. మరో ఇద్దరు యువతులను వివాహం చేసుకున్నట్లు తేలింది. ఆ యువతుల తల్లిదండ్రుల వారిని తీసుకెళ్లడంతో.. ఆమె మౌనికను మూడో వివాహం చేసుకుంది. రమాదేవి ప్రస్తుతం నీరసంగా ఉందని, చికిత్స అనంతరం విచారణ జరుపుతామని డీఎస్పీ తెలిపారు.
అదే మిల్లులో కాశిరెడ్డినాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన రమాదేవి (18) పనిచేస్తోంది. ఈ క్రమంలో వారిద్దరికీ పరిచయం పెరిగింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దీంతో కొన్ని నెలల కిందట వారిద్దరూ పెద్దలకు తెలియకుండా పులివెందులలో పెళ్లి చేసుకున్నారు.
క్రిస్మస్ పండగ కోసం మౌనికను తల్లిదండ్రులు ఇంటికి పిలిపించారు. ఇంటికి వచ్చిన ఆ యువతి ప్రవర్తనలో కుటుంబసభ్యులు మార్పు గమనించారు. పైగా ఆ యువతి రమాదేవినే కలవరిస్తూ ఉండటంతో ఫోన్ చేసి ఆమెను కూడా పిలిపించారు. ఇద్దరినీ పెద్దలు గట్టిగా ప్రశ్నించడంతో వివాహం చేసుకున్నామని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని చెప్పారు. యువతులిద్దరూ పెద్దల మాట వినకపోవడంతో మంగళవారం (డిసెంబర్ 26) జమ్మలమడుగు డీఎస్పీ కృష్ణణ్ను ఆశ్రయించారు.
డీఎస్పీ వారిని విచారించగా మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గతంలో రమాదేవి.. మరో ఇద్దరు యువతులను వివాహం చేసుకున్నట్లు తేలింది. ఆ యువతుల తల్లిదండ్రుల వారిని తీసుకెళ్లడంతో.. ఆమె మౌనికను మూడో వివాహం చేసుకుంది. రమాదేవి ప్రస్తుతం నీరసంగా ఉందని, చికిత్స అనంతరం విచారణ జరుపుతామని డీఎస్పీ తెలిపారు.