ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోయినా... కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలోనే హోదా ప్రయోజనాలున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హోదాపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని సూచించారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో 18వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాలో గమేస పవన విద్యుత్ కర్మాగారాన్ని శుక్రవారం బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేయగలిగామని.. త్వరలో 12వేల మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తికి ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామని.. సౌర, పవన విద్యుదుత్పత్తికి మెరుగైన ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. విశాఖలో రెండోసారి జరిగిన భాగస్వామ్య సదస్సులో 655 అవగాహన ఒప్పందాలు జరిగాయని.. వీటితో 10లక్షల మందికి ఉపాధి లభించనుందని బాబు అన్నారు. రానున్న రోజుల్లో మరిన్నీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాడానికి ముందుకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో 18వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాలో గమేస పవన విద్యుత్ కర్మాగారాన్ని శుక్రవారం బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేయగలిగామని.. త్వరలో 12వేల మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తికి ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామని.. సౌర, పవన విద్యుదుత్పత్తికి మెరుగైన ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. విశాఖలో రెండోసారి జరిగిన భాగస్వామ్య సదస్సులో 655 అవగాహన ఒప్పందాలు జరిగాయని.. వీటితో 10లక్షల మందికి ఉపాధి లభించనుందని బాబు అన్నారు. రానున్న రోజుల్లో మరిన్నీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాడానికి ముందుకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.