యాప్నగరం

ఏడంతస్తుల భవనంపై నుంచి పడి కూలీల దుర్మరణం..

హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో అయోధ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. బాధితుల్లో ఒకరు మహబూబ్ నగర్‌కు చెందిన

TNN 16 Aug 2017, 12:29 pm
హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. అయోధ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనంపై నుంచి పడి ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. బాధితుల్లో ఒకరు మహబూబ్ నగర్‌కు చెందిన కృష్ణ కాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన నగేశ్‌గా గుర్తించారు. ఇద్దరు 30 ఏళ్లలోపు యువకులే కావడం గమనార్హం. పొట్ట చేతబట్టుకొని నగరానికి వచ్చిన యువ కూలీల మరణంతో ఆ కుటుంబాలు దిక్కుతోచనివిగా మారడంతో పలువురు కంటతడి పెడుతున్నారు. బాధితులిద్దరికీ చిన్న పిల్లలున్నారని బంధువులు చెబుతున్నారు. వారు ఆ భవన నిర్మాణ పనులకు బుధవారమే తొలిసారిగా వచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే చేదు వార్త వినడంతో ఆ కుటుంబాలు కకావికలమవుతున్నాయి.
Samayam Telugu 2 construction workers died after falling from 7 storey building in hyderabad
ఏడంతస్తుల భవనంపై నుంచి పడి కూలీల దుర్మరణం..


భవన నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే గోడ కూలి యువ కూలీలు దుర్మరణం పాలయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వారంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.