యాప్నగరం

మెట్రో పిల్లర్లపై పోలీసుల తక్షణ చర్యలు!

మెట్రో రైలు కోసం జంట నగరాల్లో సుమారుగా 2000 పిల్లర్లను నిర్మించగా.. ఇందులో 220 వరకు ప్రమాదాలకు కారణంగా ఉన్నాయని తేల్చారు.

TNN 13 Jun 2017, 11:13 am
హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణమవుతున్న మెట్రో పిల్లర్లపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి అనంతరం.. ప్రమాదకరంగా ఉన్న మెట్రో స్తంభాలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. గత రెండు వారాలుగా వీటిపై అధ్యయనం చేసిన ట్రాఫిక్ విభాగం నిపుణుల ​ బృందం.. జీహెచ్‌ఎంసీ, మెట్రో నిర్వహణ సంస్థకు నివేదికను సమర్పించింది. మెట్రో రైలు కోసం జంట నగరాల్లో సుమారుగా 2000 పిల్లర్లను నిర్మించగా.. ఇందులో 220 వరకు ప్రమాదాలకు కారణంగా ఉన్నాయని తేల్చారు. వీటిలో 50 స్తంభాలు అతి ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి తక్షణమే రేడియం స్టిక్కర్లను అతికించే పనిలో పడ్డారు పోలీసులు.
Samayam Telugu 220 metro pillars detected as accident spots in hyderabad
మెట్రో పిల్లర్లపై పోలీసుల తక్షణ చర్యలు!


పోలీసు కంట్రోల్ రూం, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, మాదాపూర్, నల్గొండ క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో మెట్రో పిల్లర్లు ప్రమాదకరంగా ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. చాలా చోట్ల మెట్రో లైన్లు వంపులు తిరిగి ఉన్నాయని, దీని వల్ల స్తంభాలు కూడా ఒక క్రమ పద్ధతిలో కాకుండా.. ముందుకు, వెనక్కి జరిగి ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఇలాంటి వాటికి ఢీ కొట్టడం వల్ల తరచూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని పోలీసులు తేల్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.