యాప్నగరం

సిటీ పోలీసులకి అగ్ని పరీక్షగా మారిన రెండు ర్యాలీలు

ఈరోజు హైదరాబాద్ రెండు ప్రధానమైన ర్యాలీలకి వేదిక కానుండటంతో సిటీ పోలీసులు నగరంపై నిఘా పెంచారు.

TNN 11 Apr 2017, 10:14 am
ఈరోజు హైదరాబాద్ రెండు ప్రధానమైన ర్యాలీలకి వేదిక కానుండటంతో సిటీ పోలీసులు నగరంపై నిఘా పెంచారు. దాదాపు 2,500 సీసీటీవీ కెమెరాల సహాయంతో ఎక్కడికక్కడ పోలీసు స్టేషన్ల నుంచే కాకుండా బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి కూడా పోలీసులు సిటీని మానిటరింగ్ చేస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా పాతబస్తీలోని గౌలిగూడలో వున్న రామమందిరం నుంచి ఉదయం 11 గంటలకి ప్రారంభం కానున్న హనుమాన్ శోభాయాత్ర సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్ ఫంక్షన్ హాలు వద్ద ముగియనుంది.
Samayam Telugu 2500 cctvs to keep an eye on hanuman shobhayatra in hyderabad
సిటీ పోలీసులకి అగ్ని పరీక్షగా మారిన రెండు ర్యాలీలు


ఇదిలావుంటే, మరోవైపు షియా వర్గానికి చెందిన ముస్లిం సోదరులు ఇవాళ హజ్రత్ అలీ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టనున్నారు. సోత్ జోన్‌లోని మీర్‌చౌక్ ప్రాంతంలో వున్న జాఫ్రీ గల్లి నుంచి సాయంత్రం 5 గంటలకి మొదలయ్యే ఈ భారీ ర్యాలీ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మౌలాలి వద్ద ముగియనుంది.

ఈ రెండు ర్యాలీలు ప్రశాంతంగా ముగిసేందుకు అటు జీహెచ్ఎంసీ, ఇటు సిటీ పోలీసు విభాగాలు రెండూ సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నాయి. ప్రధానమైన కూడళ్లతోపాటు మతపరంగా సున్నితమైన సమస్యాత్మక ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలతో పోలీసులు ఆయా ప్రదేశాలని నిశితంగా పరిశీలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.