యాప్నగరం

పాడేరులో ఆటోబోల్తా.. పసిబిడ్డ సహా ముగ్గురు మృతి

పాడేరులో సోమవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 6 నెలల చిన్నారితో సహా ముగ్గురు మరణించారు.

Samayam Telugu 22 Oct 2018, 5:07 pm
విశాఖ జిల్లా పాడేరులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారిలో ఆరు నెలల చిన్నారి కూడా ఉంది.
Samayam Telugu eee


ప్రమాదం సమయంలో ఆటోలో డ్రైవర్‌తో సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. పాడేరు నుంచి బయల్దేరిన ఆటో వంట్లమామిడి ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి ఘాట్ రోడ్డు మీద నుంచి పల్టీలు కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఓ మహిళ లోయలో పడిపోగా, చిన్నారి, మరో మహిళ తీవ్రంగా గాయపడి చనిపోయారు. ఈ సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలికి చేరి సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.