గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను కిరణ్సింగ్, అక్షితబాయ్, శారదబాయ్గా గుర్తించారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరి, గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారు అతివేగంగా ప్రయాణిస్తోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
డివైడర్ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Samayam Telugu 30 Apr 2018, 8:38 am