యాప్నగరం

చిటికెలో మూడున్నర కిలోల బంగారం కొట్టేసింది

వ్యాపారిని మోసం చేసి... ఓ కిలాడీ లేడీ మూడున్నర కిలోల బంగారం దోచేసింది.

TNN 17 Apr 2017, 12:11 pm
వ్యాపారిని మోసం చేసి... ఓ కిలాడీ లేడీ మూడున్నర కిలోల బంగారం దోచేసింది. ఏ మాత్రం కష్టపడక్కుండా... చిన్న అబద్ధంతో నమ్మించేసి బడా మోసం చేసింది. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఈ ఘటన జరిగింది. అభిషేక్ అగర్వాల్ అనే వ్యాపారి మూడున్నర కిలోల బంగారాన్ని తీసుకుని తన కారులో వెళ్తున్నాడు. కూకట్ పల్లి ఎస్ మార్ట్ సమీపంలోకి రాగానే... ఓ మహిళ ఎదురుగా వచ్చి... ఆపమని సైగ చేసింది. అతను కారు ఆపగానే.... కారు టైరు పంక్చరయ్యింది చూసుకోమంటూ సలహా ఇచ్చింది. వ్యాపారి బంగారం మూటని కారులోనే పెట్టి... తాను మాత్రం దిగి వంగి టైర్లు చూసుకుంటున్నాడు. ఈ లోపు ఆ మహిళ బంగారం బ్యాగు పట్టుకుని ఉడాయించింది. కారులో బ్యాగు లేకపోవడంతో కంగారు పడిన వ్యాపారి, ఆ మహిళ పనేనని నిర్ధారణకు వచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ​ ఆ బంగారం విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా.
Samayam Telugu 3 kg gold stolen from car by women in hyderababd
చిటికెలో మూడున్నర కిలోల బంగారం కొట్టేసింది


పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా... ఒక మహిళ మాత్రమే అక్కడ కనిపిస్తోంది. ఆమె ఒక్కతే బంగారం మూట పట్టుకుని అంత త్వరగా తప్పించుకోలేదు కనుక ఆమె వెనుక ఓ ముఠా ఉండి ఉంటుందని భావిస్తున్న పోలీసులు. అయితే ఏ కారు ఆపకుండా కేవలం మూడున్నర కిలోల బంగారంతో వెళ్తున్న కారునే మహిళ ఎలా ఆపిందనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అభిషేక్ బంగారంతో వెళుతున్న విషయం తెలిసిన వారే చేసి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.