హైదరాబాద్లోని పాతబస్తీలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ఓ స్నూకర్ పార్లర్లో క్యాషియర్గా పనిచేస్తున్న 27ఏళ్ల షబ్బీర్ హుస్సేన్ అనే యువకుడిపై ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడిచేశారు. డబీర్పురాలోని గ్రాండ్ స్నూకర్ పార్లర్లో కూర్చున్న హుస్సేన్పై బేస్బాల్ స్టిక్స్, కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన హుస్సేన్ను స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దాడి దృశ్యాలు పార్లర్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీపీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితులను మెస్సీ, అమీర్, హైదర్గా పోలీసులు గర్తించారు.
#WATCH 3 men assaulted an employee of a snooker parlour in Hyderabad; reason unknown, police begin investigation,victim admitted to hospital pic.twitter.com/gdQuPHD5Cl — ANI (@ANI) September 7, 2017
అయితే నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. దాడికి గల కారణాలు తెలియలేదని చెప్పారు. విచారణ పూర్తయిన తరవాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా, దాడి సమయంలో పార్లర్లో చాలా మంది ఉన్నప్పటికీ హుస్సేన్ కాపాడలేకపోయారు. అడ్డుకునేందుకు వచ్చిన కొంత మందిపై కూడా దుండగులు దాడి చేయడంతో వారు భయంతో పారిపోయారు. ఇద్దరు వ్యక్తులు బేస్బాల్ బ్యాట్లతో ఇష్టమొచ్చినట్లు కొట్టగా.. మరో వ్యక్తి కత్తితో హుస్సేన్ వీడిపై అనేకసార్లు పొడిచాడు. దీంతో హుస్సేన్కు తీవ్ర రక్తస్రావమైంది. అయితే ప్రస్తుతం హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఉస్మానియా వైద్యులు వెల్లడించారు.
#WATCH 3 men assaulted an employee of a snooker parlour in Hyderabad; reason unknown, police begin investigation,victim admitted to hospital pic.twitter.com/gdQuPHD5Cl — ANI (@ANI) September 7, 2017
అయితే నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. దాడికి గల కారణాలు తెలియలేదని చెప్పారు. విచారణ పూర్తయిన తరవాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా, దాడి సమయంలో పార్లర్లో చాలా మంది ఉన్నప్పటికీ హుస్సేన్ కాపాడలేకపోయారు. అడ్డుకునేందుకు వచ్చిన కొంత మందిపై కూడా దుండగులు దాడి చేయడంతో వారు భయంతో పారిపోయారు. ఇద్దరు వ్యక్తులు బేస్బాల్ బ్యాట్లతో ఇష్టమొచ్చినట్లు కొట్టగా.. మరో వ్యక్తి కత్తితో హుస్సేన్ వీడిపై అనేకసార్లు పొడిచాడు. దీంతో హుస్సేన్కు తీవ్ర రక్తస్రావమైంది. అయితే ప్రస్తుతం హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఉస్మానియా వైద్యులు వెల్లడించారు.