యాప్నగరం

తండ్రి నడుపుతున్న ట్రాక్టర్ కింద చిన్నారి.. అమ్మ చేతితో అవే చివరి గోరుముద్దలు

తండ్రి కోసం పరుగెత్తుకొచ్చిన చిన్నారి ట్రాక్టర్ చక్రాల కింద నలిగిపోయింది. తల్లి చేతితో అన్నం ముద్దలు తింటున్న ఆ చిన్నారికి అవే చివరి గోరుముద్దలు అయ్యాయి. ఈ హృదయ విదాకర ఘటన కరీంనగర్‌‌లో జరిగింది.

Samayam Telugu 11 Jun 2019, 8:13 pm
తండ్రి నడుపుతున్న ట్రాక్టరే అతడి ముద్దుల కుమార్తె పాలిట మృత్యువాహనమైంది. తండ్రి కోసం పరుగెత్తుకొచ్చిన చిన్నారి ట్రాక్టర్ చక్రాల కింద నలిగిపోయింది. తల్లి చేతితో అన్నం ముద్దలు తింటున్న ఆ చిన్నారికి అవే చివరి గోరుముద్దలు అయ్యాయి. ఈ హృదయ విదాకర ఘటన కరీంనగర్‌ మండలం చెర్లబూత్కూర్‌ గ్రామంలో మంగళవారం (జూన్ 11) ఉదయం చోటుచేసుకుంది.
Samayam Telugu rithika
కరీంనగర్ విషాదం


చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన జక్కు ప్రసాద్ గారాలపట్టి రితిక (3) తన ఇంటి ముందు ఆడుకుంటూ అమ్మ చేత గోరుముద్దలు తింటోంది. అయితే.. గిన్నెలోని అన్నం పూర్తవడంతో మరింత పెట్టుకొని వచ్చేందుకు తల్లి ఇంట్లోకి వెళ్లింది. అదే సమయంలో తండ్రి ట్రాక్టర్‌ను తీస్తుండటాన్ని గమనించిన రితిక ఆ వైపుగా వెళ్లింది.

పాపను గమనించకుండా ప్రసాద్ తన ట్రాక్టర్‌‌ను వెనక్కి పోనిచ్చాడు. ఆ సమయంలో ఒక్కసారిగా తన చిన్నారి అరుపులు వినడంతో అతడికి గుండె ఆగినంత పనైంది. ట్రాక్టర్‌‌ను నిలిపేసి చక్రాల కింద నలిగి విలవిల్లాడుతున్న పాపను వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చిన్నారి ప్రాణాలు విడిచింది. కన్నవాళ్లకు తీరని కడుపుకోత మిగిల్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.