విక్రమ్ గౌడ్ తరహా హత్యాయత్నం డ్రామా మరోటి వెలుగులోకి వచ్చింది. తోడల్లుడితో ఉన్న ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఓ వ్యక్తి రూ. 2 లక్షలు సుఫారీ ఇచ్చి తనపైనే హత్యాయత్నం చేయించుకున్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. గతంలో పలు మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పని చేసిన శ్యామ్ కుమార్.. నగరంలోని సీతారాంపురంలో ఉంటూ ‘సాయంకాలం’ దినపత్రిక నడుతుపుతున్నాడు. తన తోడల్లుడు సుబ్బారావుతో కలిసి విద్యాధరపురంలో ఓ ప్రింటింగ్ ప్రెస్ను కూడా నిర్వహిస్తున్నాడు. అయితే.. సుబ్బారావు తన సొంత అవసరాల నిమిత్తం శ్యాంకు సంబంధించిన ఆస్తిని బ్యాంకులో హామీగా పెట్టి రూ. 20 లక్షల రుణం తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఆస్తిని జప్తు చేస్తామంటూ బ్యాంకు నుంచి శ్యామ్కు నోటీసులు వచ్చాయి.
ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. పెద్దమనుషులు పంచాయతీ కుదిర్చారు. సుబ్బారావు రూ. 15 లక్షలు ఇచ్చేవిధంగా ఒప్పందం కుదిర్చారు. ఆ తర్వాత ఇంటికెళ్లిన శ్యామ్ ఓ కుట్రపూరిత ఆలోచన చేశాడు. సుబ్బారావును ఏదైనా కేసులో ఇరికించి, బెదిరిస్తే.. రూ. 40 లక్షల వరకు వసూలు చేయోచ్చని పన్నాగం పన్నాడు.
ఈ క్రమంలో శ్యామ్.. తనపై హత్యాయత్నం చేయించుకొని తోడల్లుడిని కేసులో ఇరికించడానికి ప్లాన్ చేశాడు. దీని కోసం తన మిత్రులైన నాగేంద్ర, కృష్ణప్రసాద్ సాయం తీసుకున్నాడు. ఈ పని చేసిపెడితే వారికి రూ. 2 లక్షలు ఇస్తానని బేరం కుదుర్చుకున్నాడు. అంతేకాకుండా ఏవిధంగా దాడి చేయాలో, తన శరీరంపై ఏ భాగంలో కత్తిపోట్లు వేయాలో వివరించి చెప్పాడు.
ముందస్తు ప్రణాళిక ప్రకారం.. నాలుగు రోజుల కిందట చీకటి పడుతుండగా ఇంటి ఆవరణలో నిల్చొని ఉన్న శ్యామ్ను.. నాగేంద్ర, కృష్ణప్రసాద్ కత్తితో పొడిచి పారిపోయారు. ఆ తర్వాత శ్యామ్ను ఆసుపత్రికి తరలించారు. శ్యామ్ ముందుగా చెప్పిన కట్టుకథను అతడి భార్య పోలీసుల వద్ద పొల్లుపోకుండా చెప్పింది.
రూ. 15 లక్షలు ఎగ్గొట్టడానికి సుబ్బారావే ఈ హత్యాయత్నం చేశాడని, డబ్బులడిగితే చంపేస్తామని నిందితులు బెదిరించారని శ్యామ్ భార్య పోలీసులకు చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే సమయంలో శ్యామ్ మనుషులు అమెరికాలో ఉన్న తోడల్లుడి కుమారుడికి ఫోన్ చేసి రూ. 40 లక్షలు ఇవ్వాలంటూ బేరాలు మొదలుపెట్టారు.
శ్యామ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అతడి కాల్ డేటాను పరిశీలించి, తమదైన శైలిలో పరిశీలించగా అసలు గుట్టు బయటపడింది. దీంతో శ్యామ్తో పాటు ఆ ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. పెద్దమనుషులు పంచాయతీ కుదిర్చారు. సుబ్బారావు రూ. 15 లక్షలు ఇచ్చేవిధంగా ఒప్పందం కుదిర్చారు. ఆ తర్వాత ఇంటికెళ్లిన శ్యామ్ ఓ కుట్రపూరిత ఆలోచన చేశాడు. సుబ్బారావును ఏదైనా కేసులో ఇరికించి, బెదిరిస్తే.. రూ. 40 లక్షల వరకు వసూలు చేయోచ్చని పన్నాగం పన్నాడు.
ఈ క్రమంలో శ్యామ్.. తనపై హత్యాయత్నం చేయించుకొని తోడల్లుడిని కేసులో ఇరికించడానికి ప్లాన్ చేశాడు. దీని కోసం తన మిత్రులైన నాగేంద్ర, కృష్ణప్రసాద్ సాయం తీసుకున్నాడు. ఈ పని చేసిపెడితే వారికి రూ. 2 లక్షలు ఇస్తానని బేరం కుదుర్చుకున్నాడు. అంతేకాకుండా ఏవిధంగా దాడి చేయాలో, తన శరీరంపై ఏ భాగంలో కత్తిపోట్లు వేయాలో వివరించి చెప్పాడు.
ముందస్తు ప్రణాళిక ప్రకారం.. నాలుగు రోజుల కిందట చీకటి పడుతుండగా ఇంటి ఆవరణలో నిల్చొని ఉన్న శ్యామ్ను.. నాగేంద్ర, కృష్ణప్రసాద్ కత్తితో పొడిచి పారిపోయారు. ఆ తర్వాత శ్యామ్ను ఆసుపత్రికి తరలించారు. శ్యామ్ ముందుగా చెప్పిన కట్టుకథను అతడి భార్య పోలీసుల వద్ద పొల్లుపోకుండా చెప్పింది.
రూ. 15 లక్షలు ఎగ్గొట్టడానికి సుబ్బారావే ఈ హత్యాయత్నం చేశాడని, డబ్బులడిగితే చంపేస్తామని నిందితులు బెదిరించారని శ్యామ్ భార్య పోలీసులకు చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే సమయంలో శ్యామ్ మనుషులు అమెరికాలో ఉన్న తోడల్లుడి కుమారుడికి ఫోన్ చేసి రూ. 40 లక్షలు ఇవ్వాలంటూ బేరాలు మొదలుపెట్టారు.
శ్యామ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అతడి కాల్ డేటాను పరిశీలించి, తమదైన శైలిలో పరిశీలించగా అసలు గుట్టు బయటపడింది. దీంతో శ్యామ్తో పాటు ఆ ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.