యాప్నగరం

హరికృష్ణతో సెల్ఫీ దిగిన ఆ నలుగురిపై వేటు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరికృష్ణతో సెల్ఫీ దిగిన ఆ నలుగురిపై ఆసుపత్రి యాజమాన్యం చర్యలు తీసుకుంది.

Samayam Telugu 31 Aug 2018, 11:40 pm
తీవ్ర గాయాలతో చావుబతుకులతో పోరాడుతున్న హరికృష్ణతో సెల్ఫీలు దిగిన కామినేని ఆసుపత్రి సిబ్బందిపై యాజమాన్యం వేటు వేసింది. ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన హరికృష్ణను నల్గొండ జిల్లాలోని కామినేని ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఆయన అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో నలుగురు సిబ్బంది సెల్ఫీ తీసుకున్నారు.
Samayam Telugu Untitled123


ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొట్టడంతో కామినేని ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. ఆ నలుగురి సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ‘‘మా కామినేని ఆసుపత్రిలో రోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం. కానీ, మా సిబ్బందిలో కొంతమంది చేసిన తప్పిదం వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగింది. మా సిబ్బందిలో కొందరి అనాగరిక, అమానుష ప్రవర్తన వల్ల ఈ తప్పిదం జరిగింది. ఈ విషయాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని విధుల నుంచి తొలగించాం. ఇటువంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం. మా ఆసుపత్రి తరఫున హరికృష్ణగారి శ్రేయోభిలాషులు, అభిమానులకు క్షమాపణలు తెలుపుకుంటున్నాం’’ అని ప్రకటనలో వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.