యాప్నగరం

కుటుంబ తగాదాలు.. కూతుళ్లతో పాటు చెరువులో దూకిన దంపతులు

హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్‌ జిల్లా కీసర మండలం కొండాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో ఏర్పడిన ఆస్తి తగాదాతో తీవ్రంగా కలత చెందిన ఓ వ్యక్తి తన భార్య, పిల్లలతో పాటు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

TNN 6 Feb 2018, 10:26 pm
హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్‌ జిల్లా కీసర మండలం కొండాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో ఏర్పడిన ఆస్తి తగాదాతో తీవ్రంగా కలత చెందిన ఓ వ్యక్తి తన భార్య, పిల్లలతో పాటు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఘట్‌కేసర్‌ మండలం కొండాపూర్‌కు చెందిన రమేశ్‌ (35), మానస (22) దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. రమేశ్‌ కొంతకాలంగా తన తల్లిదండ్రులతో ఆస్తి విషయంలో తగాదా పడుతున్నాడు.
Samayam Telugu 4 members of a family commits suicide by jumping in a lake
కుటుంబ తగాదాలు.. కూతుళ్లతో పాటు చెరువులో దూకిన దంపతులు


రెండో కూతురు మానస్వి (7 నెలలు) పుట్టిన తర్వాత ఈ గొడవలు మరింత ముదిరాయి. మానసను ఆమె అత్తామామలతో పాటు ఆడపడచులు కూడా తీవ్రంగా వేధింపులకు గురిచేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

రమేశ్‌ తల్లిదండ్రులు ఇటీవల తమ ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మగా రూ. 6 లక్షల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో తనకు వాటా ఇవ్వబోమని చెప్పడంతో రమేశ్‌ మనస్తాపానికి గురయ్యాడు. భార్య మానస, కూతురు మనస్వి, పెద్ద కుమార్తె గీతాశ్రీ(3)తో కలిసి సోమవారం (ఫిబ్రవరి 5) అతడు కీసర సమీపంలోని పెద్దమ్మ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.