యాప్నగరం

ఏపీలోని నాలుగు రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ హోదా

ఏపీలోని నాలుగు రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 4 Apr 2018, 12:32 pm
ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలు కేంద్ర వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారి ఆగ్రహాన్ని చల్లబర్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని నాలుగు రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ హోదా కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. విజయవాడ, గుంటూరు, కర్నూలు, గుంతకల్లు స్టేషన్లకు అంతర్జాతీయ హోదా కల్పించిన రైల్వే శాఖ.. ఆధునికీకరణ, వసతుల కల్పనకు ఒక్కో స్టేషన్‌కు రూ.25 కోట్లు మంజూరు చేయనుంది. ఏప్రిల్ 10లోగా ప్రతిపాదనలు పంపాలని రైల్వే శాఖ ఆయా స్టేషన్లకు ఆదేశాలు జారీ చేసింది.
Samayam Telugu vijayawada-railway-station


రైల్వే శాఖ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ఈ ఎత్తులు వేస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నాలుగు స్టేషన్లు సరే.. విశాఖపట్నం సంగతేంటని అడుగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి ఒక్కో స్టేషన్‌కు రూ.25 కోట్లు సరిపోతాయా? అని ప్రశ్నిస్తున్నారు.

దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాల స్థాయిలో హంగులు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటిలో తెలంగాణ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్‌కు మాత్రమే స్థానం లభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.