యాప్నగరం

పోలవరంలో విషాదం.. గోదావరిలో మునిగి పర్యాటకులు మృతి

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం శివగిరిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌వాసులుగా భావిస్తున్నారు.

Samayam Telugu 31 Mar 2018, 4:41 pm
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం శివగిరిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు వ్యక్తులు, ఒక మహిళ ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న శివగిరి గ్రామస్థులు ఘటనా స్థలికి చేరుకునేసరికే వారంతా మృత్యువాతపడ్డారు. మృతదేహాలను వెలికి తీసిన గ్రామస్థులు.. అధికారులకు సమాచారం అందించారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌వాసులుగా భావిస్తున్నారు.
Samayam Telugu Shivagiri
ప్రమాదం జరిగిన ప్రదేశం..


శుక్రవారం (మార్చి 30) సాయంత్రం 12 మంది పర్యాటకులు పాపికొండల సందర్శనకు వెళ్లారు. వీరంతా శివగిరి కాటేజీల్లో బసచేశారు. శనివారం ఉదయం స్నానం కోసం గోదావరి నదిలోకి దిగిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.