యాప్నగరం

మరుగుతున్న సాంబారులో పడి చిన్నారి మృతి

సాంబారు గిన్నెలో పడి నాలుగేళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూర్‌ మండలం నెమ్మికల్‌లో గ్రామానికి చెందిన మోరపాక నాగయ్య, సునీత దంపతుల చిన్న కుమార్తె కృతిక (4) గురువారం (నవంబర్ 9) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తూ పొయ్యిపై మసులుతున్న సాంబారు గిన్నెలో పడిపోయింది.

TNN 11 Nov 2017, 8:38 am
సాంబారు గిన్నెలో పడి నాలుగేళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూర్‌ మండలం నెమ్మికల్‌లో గ్రామానికి చెందిన మోరపాక నాగయ్య, సునీత దంపతుల చిన్న కుమార్తె కృతిక (4) గురువారం (నవంబర్ 9) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తూ పొయ్యిపై మసులుతున్న సాంబారు గిన్నెలో పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. కృతిక శుక్రవారం మృతి చెందింది.
Samayam Telugu 4 years old girl dies after falling in hot sambar in suryapet
మరుగుతున్న సాంబారులో పడి చిన్నారి మృతి


నాగయ్య తండ్రి మోరపాక మల్సూరు ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. బుధవారమే ఇంట్లో ఆయన పెద్దకర్మ నిర్వహించారు. ఆ బాధ నుంచి మరిచిపోకముందే అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి మరణించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.