యాప్నగరం

పండగ రోజు విషాదం.. ఈతకెళ్లి ఐదుగురి మృతి

పండగ రోజు విషాద ఘటన జరిగింది. ఈత సరదా ఐదుగురి ప్రాణాలు తీసింది. మెదక్ జిల్లాలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Samayam Telugu 18 Mar 2018, 3:41 pm
పండగ రోజు విషాద ఘటన జరిగింది. ఈత సరదా ఐదుగురి ప్రాణాలు తీసింది. మెదక్ జిల్లాలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్‌కు చెందిన చెందిన ఇంతియాజ్, మహ్మద్ హఫీజ్‌లు మరో ముగ్గురు స్కూల్ విద్యార్థులతో కలిసి కన్నారం పెద్ద చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే నీళ్లలోకి దిగాక... లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయారు. వీరి కేకలు విన్న స్థానికులు పరుగెత్తి అక్కడికి వచ్చేలోపు ప్రాణాలు విడిచారు. వెంటనే కొంతమంది చెరువులోకి దిగి మృతదేహాలను బయటకు తీశారు.
Samayam Telugu 5 dead in medak district after drown into lake for swimming
పండగ రోజు విషాదం.. ఈతకెళ్లి ఐదుగురి మృతి


మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇషాక్, హుదా, అహ్మద్‌లు పదేళ్లలోపు వారే. అప్పటి వరకు సరదాగా తమ కళ్లముందే తిరిగిన వాళ్లు విగతజీవులుగా మారడంతో స్థానికంగా విషాదం నింపింది. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన పిల్లలు చనిపోవడాన్ని చూసి... చిన్నారుల తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.