యాప్నగరం

Peddahothur Road Accident: కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం, 15 మందికి గాయాలు

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టాటా ఏఎస్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. 15 మంది గాయపడ్డారు.

Samayam Telugu 17 Oct 2018, 8:47 am
కర్నూలు జిల్లా ఆలూరు మండంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద హోతూరు వద్ద ఎలార్తి దర్గాకు వెళుతున్న టాటా ఏస్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Samayam Telugu kurnool accident


వాహనం రిపేర్ కావడంతో.. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా.. ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో వాహనంలో మూడు కుటుంబాలకు చెందిన 21 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా కర్నూలు వన్‌టౌన్‌కు చెందినవారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడటం అందర్నీ కలచివేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.