యాప్నగరం

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెను విషాధం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కస్తూరి జనార్దన్‌ (58) అనే వ్యక్తి భార్య చంద్రకళ (50), ఇద్దరు కుమారులు సురేష్ (33), అశోక్ (26)తో..

TNN 18 Sep 2017, 1:28 pm
సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కస్తూరి జనార్దన్‌ (58) అనే వ్యక్తి భార్య చంద్రకళ (50), ఇద్దరు కుమారులు సురేష్ (33), అశోక్ (26)తో సూర్యాపేట నగరంలో నివాసముంటున్నాడు. సురేశ్‌‌కు భార్య ప్రభాత (29), కుమార్తెలు శాన్విక(5), రుత్విక(3) ఉన్నారు. సురేష్ ఇటీవల షేర్‌ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. దీంతో అప్పుల భారం పెరిగి 3 రోజుల కిందట అతడు కనిపించకుండాపోయాడు.
Samayam Telugu 6 members of family commits suicide in suryapet
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య


ఈ నేపథ్యంలో జనార్దన్‌, చంద్రకళ, ప్రభావతి, అశోక్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 17) అర్ధరాత్రి వీరంతా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరితో పాటు పిల్లలు శాన్విక, రుత్వికకు కూడా పురుగుల మందు తాగించడంతో తెల్లారికల్లా అందరూ విగతజీవులుగా మారిపోయారు.

సోమవారం ఉదయం చుట్టుపక్కల వారు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.