యాప్నగరం

కుప్పం: లోయలోపడిన లారీ.. ఏడుగురి మృతి

మామిడికాయలు వేసుకుని వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 15 మంది గాయపడ్డారు.

Samayam Telugu 17 Jun 2018, 2:01 am
చిత్తూరు జిల్లాలో శనివారం (జూన్ 16) రాత్రి 9 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని కుప్పం మండలం నాయనురు సమీపంలో జరిగింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. లారీ కింద మరో 15 మంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Samayam Telugu accident


క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో లారీలో 32 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మృతులంతా తమిళనాడుకు చెందిన కూలీలుగా గుర్తించారు.

కుప్పంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఫోన్‌లో కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌, ఎస్పీని ఆదేశించారు. క్షతగాత్రులకు వైద్య సహాయం సహా, అన్నివిధాలా సాయం అందించాలని ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.