యాప్నగరం

పాదయాత్రలో జగన్‌కు బైక్ బహుమానం!

సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో నడుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అభిమాని ఒకరు ఆసక్తిదాయకమైన కానుకను అందించాడు.

TNN 5 Feb 2018, 4:33 pm
సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో నడుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అభిమాని ఒకరు ఆసక్తిదాయకమైన కానుకను అందించాడు. జగన్ కోసం వుడ్ చేసిన బైక్ ను కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర నెల్లూరులో సాగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో అభిమాని ఈ కానుకను అందించాడు.
Samayam Telugu a fan presents wooden bike to ys jagan
పాదయాత్రలో జగన్‌కు బైక్ బహుమానం!


ఈ సందర్భంగా వైఎస్ జగన్ బైక్ మీద కాసేపు కూర్చుని అభిమానిని సంతోష పెట్టాడు. సోమవారంతో జగన్ పాదయాత్ర 80వ రోజుకు చేరుకుంది. కోవూరు నియోజకవర్గం పరిధిలో రైతులతో సంభాషించారు వైకాపా అధినేత. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదన్నారు. రైతుల పరిస్థితి బాగుండేదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు నమ్మి రైతాంగం మోసపోయిందని జగన్ అభిప్రాయపడ్డారు.

తను హామీగా ఇచ్చిన ‘నవరత్నాలు’ గురించి జగన్ వివరించారు. వైఎస్ హయాంలో రైతులు కరెంటు బిల్లు ఇరవై రూపాయలు కట్టగా ఇప్పుడు మూడు వందల రూపాయలు కట్టే పరిస్థితి వచచ్చిందన్నారు. గవర్నమెంటు ఆసుపత్రుల్లో పని చేసే నర్సులు జగన్ ను కలిసి తమకు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.