యాప్నగరం

పురుషాంగం కోసి, కనుగుడ్లు పీకి యువకుడి ఆత్మ‘హత్య’!

​ తెలంగాణలోని మంథనిలో జరిగిన యువకుడి ఆత్మ‘హత్య’ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మార్చి 14న జరిగిన ఈ హత్యోందతం ఆలస్యంగా

TNN 1 Apr 2017, 6:09 pm
తెలంగాణలోని మంథనిలో జరిగిన యువకుడి ఆత్మ‘హత్య’ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మార్చి 14న జరిగిన ఈ హత్యోందతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంథనికి చెందిన మధు, శిరీష ప్రేమించుకున్నారు. దళిత వర్గానికి చెందిన యువకుడు కావడంతో వారి ప్రేమకు యువతి తల్లిదండ్రులు అంగీకరించని భావించిన వారిద్దరూ పురుగుల మందు తాగారు. తర్వాత ఆ అబ్బాయి చనిపోగా.. అమ్మాయి కరీనంగర్‌లో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా మధుది ఆత్మహత్యేనని ధృవీకరించారు.
Samayam Telugu a honour death has taken place in manthani dist
పురుషాంగం కోసి, కనుగుడ్లు పీకి యువకుడి ఆత్మ‘హత్య’!


ఇది ఆత్మహత్య కాదని, హత్య అని యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పురుషాంగం కోసి, కనుగుడ్లు పీకేసిన ఉన్న స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం కావడం వారి వాదనకు బలం చేకూరుస్తోంది.

‘మార్చి 13న మా తమ్ముడు ఇంట్లో నుంచి బయకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఉదయం 11:52 గంటల సమయంలో ఆ అమ్మాయి ఫోన్ చేసి మధును చంపేసి, మీ ఇంటి వెనుకున్న తుమ్మ పొదల్లో వేశారని చెప్పింది’ అని మధు సోదరుడు చెప్పాడు.

సదరు యువతి అధికార పార్టీ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువని, ఈ హత్యోదంతం ఆయన కనుసన్నలోనే జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. హత్యకు ముందు యువకుణ్ని చిత్రహింసలకు గురి చేశారని తెలుస్తోంది. అతడి చేత బలవంతంగా మలాన్ని కూడా తినిపించారని, దళిత యువకుడు తన కంటే ఎగువ వర్ణానికి చెందిన యువతిని ప్రేమించినందుకే ఇంత దారుణానికి ఒడిగట్టారని సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.