యాప్నగరం

హెచ్‌సీయూ ఘటనపై టి. అసెంబ్లీలో దుమారం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో హెచ్ సీయూ ఘటనపై వాడీ వేడి చర్చ జరిగింది.

TNN 26 Mar 2016, 6:10 pm
హెచ్,సీయూ, ఓయూ ఘటనలకు నిరసగా శనివారం టి.కాంగ్రెస్ నేతలు నల్ల బ్యాడ్జీలతో సభలోకి అడుగుపెట్టారు. ప్రశ్నత్తరాల సమయం లో ఓయూ ఘటనపై చర్చ జరగాలని పట్టుబడ్డారు. దీనికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందుర్ రెడ్డి అనుమతించకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు సభలో నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో సభను తొలుత ఒక సారి వాయిదా వేసినప్పటికీ మళ్లీ సభలో ఇదే అంశంపై కాంగ్రెస్ పట్టుబట్టింది. దీనికి స్పందించిన హోం మంత్రి ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. విద్యార్ధుల ఘర్షణ సున్నితమైన అంశం కాబట్టి పోలీసులు ఆచితూచి స్పందిచారని... పలుసార్లు విద్యార్ధుల ఘర్షణలో పోలీసులకు గాయాలయ్యారని.. అయినప్పటికీ పోలీసులు సంయమనంతో వ్యవహరించారని హోం మంత్రి నాయని వివరణ ఇచ్చారు.
Samayam Telugu a hot discussion hcu incident in telangana assembly
హెచ్‌సీయూ ఘటనపై టి. అసెంబ్లీలో దుమారం


ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ హోం మంత్రి ఘటన గురించి వివరిస్తున్నారు తప్పితే.. తాము ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వడం లేదని ఆరోపించారు. వర్శిటీల్లో దశిత విద్యార్ధులకు రక్షణ కరవుమైంది. రోహిత్ అంశమే అందుకు ఉదాహరణ అని వెల్లడించారు. హెచ్ సీయూ లో దళితులపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ డిమాండ్ చేశారు. ఎవరికీ అన్యాయం జగకుూడదనే తమ ఉద్దేశమని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ అన్నారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.