యాప్నగరం

ప్ర‌త్యేక హోదా కోసం సెల్‌ట‌వ‌ర్ ఎక్కిన వ్య‌క్తి

ప్ర‌త్యేక హోదా అంశం భావోద్వేగాలతో కూడినది కావడంతో దానికి త‌గ్గ‌ట్లుగా ప్ర‌జ‌లు స్పందిస్తున్నారు. ఇదివ‌ర‌కే చిత్తూరు జిల్లాలో ఒక వ్య‌క్తి బ‌ల‌వ‌న‌ర్మ‌ణానికి పాల్ప‌డ‌గా, మ‌రికొంత మంది నిర‌స‌న‌లు తెలిపేందుకు వివిధ మార్గాల‌ను ఎంచుకుంటున్నారు.

Samayam Telugu 11 Aug 2018, 11:39 am
ప్రత్యేక హోదా కోసం ఏపీలో నిరసనలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. భావోద్వేగాలతో కూడినది కావడంతో దానికి త‌గ్గ‌ట్లుగా ప్ర‌జ‌లు స్పందిస్తున్నారు. ఇదివ‌ర‌కే చిత్తూరు జిల్లాలో ఒక వ్య‌క్తి బ‌ల‌వ‌న‌ర్మ‌ణానికి పాల్ప‌డ‌గా, మ‌రికొంత మంది నిర‌స‌న‌లు తెలిపేందుకు వివిధ మార్గాల‌ను ఎంచుకుంటున్నారు. కొందరు టవరెక్కి నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం రూరల్ పోలీస్‌స్టేషన్ దగ్గర ప్రత్యేక హోదా కోసం పెనుబోలు విజయ్‌భాస్కర్ అనే మున్సిపల్ ఉద్యోగి సెల్‌టవర్ ఎక్కాడు.
Samayam Telugu సెల్ ట‌వ‌ర్ ఎక్కి వ్య‌క్తి నిర‌స‌న‌


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, దీనిపై మోదీ ప్రకటన చేయకపోతే టవర్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ భాస్కర్ నినాదాలు చేస్తున్నాడు. దీంతో పోలీసులు అధికారులు అక్కడకు వచ్చి భాస్కర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.