యాప్నగరం

బీమా డబ్బు కోసం భర్తనే చంపించింది

తాళి అనే మాటను ఎగతాళి చేస్తున్నారు కొంతమంది మహిళలు. చిన్న, చిన్న కారణాలతోనే కట్టుకున్న భర్తల్ని క్రూరంగా చంపేస్తున్నారు. ప్రియుడి మోజులో కొందరు ... ఆస్తి గొడవలు, మనస్పర్థలతో మరికొంతమంది భర్తల్ని హతమార్చేస్తున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక జిల్లాలో ఇలాంటి దారుణాలే బయటపడుతున్నాయి. అయితే తాజాగా ఓ మహిళ బీమా డబ్బు కోసం కట్టకున్నవాడినే చంపించింది.

Samayam Telugu 15 Mar 2018, 1:19 pm
తాళి అనే మాటను ఎగతాళి చేస్తున్నారు కొంతమంది మహిళలు. చిన్న, చిన్న కారణాలతోనే కట్టుకున్న భర్తల్ని క్రూరంగా చంపేస్తున్నారు. ప్రియుడి మోజులో కొందరు ... ఆస్తి గొడవలు, మనస్పర్థలతో మరికొంతమంది భర్తల్ని హతమార్చేస్తున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక జిల్లాలో ఇలాంటి దారుణాలే బయటపడుతున్నాయి. అయితే తాజాగా ఓ మహిళ బీమా డబ్బు కోసం కట్టకున్నవాడినే చంపించింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఓ ఘటన కలకలంరేపింది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోలవీడుకు చెందిన శ్రీనివాసులు, రమాదేవిలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. శ్రీనివాసులు తన బావమరిది రమేష్‌తో కలిసి ఆయిల్ వ్యాపారం చేస్తున్నాడు.
Samayam Telugu a wife killed her husband for insurance money
బీమా డబ్బు కోసం భర్తనే చంపించింది


రమాదేవి తన సొంత గ్రామ సర్పంచ్‌ మధుసూదన్ రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే దీనికి భర్త అడ్డం వస్తున్నాడని ఆమె భావించింది. దీంతో అతడ్ని ఎలాగైనా హతమార్చాలని... మధుసూదన్ రెడ్డి, రమేష్‌తో పాటు ఆయన భార్య శివప్రణీతతో కలిసి గతంలోనే స్కెచ్ వేశారు. ప్లాన్‌లో భాగంగా... శ్రీనివాసులు పేరు మీద బీమా చేయించి... వాటిపై రుణాలు తీసుకున్నారు. తెలివిగా బీమాను వేర్వేరు ప్రాంతాల్లో చేయించారు. అతడ్ని చంపేసి ప్రమాదంగా చిత్రీకరిస్తే రూ.కోట్లు దాకా బీమా వస్తుందని భావించారు. అనుకున్న స్కెచ్ ప్రకారం శ్రీనివాసులకు చెప్పి మాయమాటలు చెప్పి రమేష్‌ తన దగ్గర పనిచేసే రమణ, మొయిన్ బాషాలతో కలిసి తీర్థయాత్రలకు తీసుకెళ్లాడు.

వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర ఆపి... రోడ్డుపై మాట్లాడుతున్నట్లు నటించారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీని గమనించి దాని కిందకు శ్రీనివాసుల్ని తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని... మొయిన్ బాషా గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని ఓర్వకల్లు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే శ్రీనివాసులు మృతిపై అనుమానంతో బంధువులు పోలీసుల్ని ఆశ్రయించారు. రమణ, మొయిన్‌బాషాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో... అసలు విషయం బయటపడింది. మిగిలిన నిందితులైన శ్రీనివాసులు భార్య రమాదేవి, బావ మరిది రమేష్, మధుసూదన్‌రెడ్డి, శివప్రణీత పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.