షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ల ఫలాలు అన్ని కులాలు సమానంగా అనుభవించేలా చట్టం సాధించేవరకు విశ్రమించబోమని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఉమ్మడి రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీజాబితాలోని అన్ని కులాలకు అందేలా న్యాయం చేయాలని 23 రోజుల పాటు ఢిల్లీలో దీక్షలు చేసిన ఆయన..ఆంధ్రభవన్లో మీడియాతో మాట్లాడారు. వంద రోజుల్లో రిజర్వేషన్ల వర్గీకరణ జరుగుతుందని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 123వ రాజ్యంగ సవరణ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా ఉందని చెప్పిన ఆయన కొంతమంది అక్కసుతోనే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుపై లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల వర్గీకరణ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజుల పాటే మేధోమదన సదస్సులు నిర్వహించి నవంబర్ 20 భారీ బహిరంగ సభ జరుపుతామని వెల్లడించారు.
వంద రోజుల్లో ‘వర్గీకరణ’ సాధించుకుంటాం
వంద రోజుల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత సాధించుకుంటామని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
Samayam Telugu 14 Aug 2016, 2:24 pm