యాప్నగరం

ఏపీ అధికారిని పట్టుకున్న ఏసీబీ

ఏపీ సచివాలయంలో మొదటిసారి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

TNN 25 Nov 2016, 8:00 pm
ఏపీ సచివాలయంలో మొదటిసారి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో ఏపీ ఉద్యోగులు పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సచివాలయం అక్కడికి తరలి వెళ్లినప్పటి నుంచి ఇంతవరకు ఏసీబీ అధికారులు అక్కడ అడుగుపెట్టలేదు. శుక్రవారం పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. సెక్షన్ ఆఫీసర్ శ్రీనాథ్‌ను వలపన్ని పట్టుకున్నారు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు తీసుకుంటుండగా శ్రీనాథ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ఇంకా సాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.