యాప్నగరం

ఇద్దరు భార్యలు.. కోట్లలో ఆస్తులు.. ఏసీబీ వలలో ఏపీ ఆఫీసర్

ఏపీలో మరో అవినీతి తిమింగళం ఏసీబీ వలకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారం అందుకున్న ఏసీబీ సోదాలు చేపట్టింది.

TNN 31 Jan 2018, 12:15 pm
ఏపీలో మరో అవినీతి తిమింగళం ఏసీబీ వలలో చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తుల కూడబెట్టిన కేసులో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ లక్ష్మీ ప్రసాద్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేపడుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలోని ఆయన నివాసాలు సహా రెండు రాష్ట్రాల్లోని 20 చోట్ల ఏసీబీ ఏక కాలంలో దాడులు చేపట్టింది. ఉదయం ఐదున్నరకే మెరుపు దాడులతో ఏసీబీ రంగంలోకి దిగింది.
Samayam Telugu acb rides on commercial tax officer laxmi prasad houses
ఇద్దరు భార్యలు.. కోట్లలో ఆస్తులు.. ఏసీబీ వలలో ఏపీ ఆఫీసర్


లక్ష్మీ ప్రసాద్‌కు విజయవాడలో మొదటి భార్య, హైదరాబాద్‌లో రెండో భార్య ఉన్నారు. అధికారికంగా ఆయన ఆస్తుల విలువ 2 కోట్లుగా గుర్తించినట్లు సమాచారం. విజయవాడలో జరిపిన తనిఖీల్లో పొలాలు, ఇళ్లు, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. గతంలో లక్ష్మీ ప్రసాద్ యనమల దగ్గర ఓఎస్డీగా పని చేశారు. విజయవాడ పటమటలోని ఆయన నివాసంలో జరిపిన దాడుల్లో ఒక కిలో బంగారం, రెండు కిలోల వెండితోపాటు నోట్ల కట్టలు లభించాయి. రూ. 10 లక్షల చొప్పున అప్పు ఇచ్చిన ప్రామిసరీ నోట్లను గుర్తించారు. ఒకరికే కోటి రూపాయలు అప్పు ఇచ్చినట్లు ప్రామిసరీ నోటీసు ద్వారా తెలుస్తోంది. రెండు కార్లతో పాటు, గచ్చిబౌలిలో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు గుర్తించారు.

ప్రస్తుతం లక్ష్మీ ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మొదటి భార్య కూడా కేన్సర్‌తో బాధ పడుతున్నారని సమాచారం. దీంతో ఇంట్లోనే ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో ఎంత మేర ఆస్తులను గుర్తించిరనే విషయమై ఏసీబీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.