యాప్నగరం

ఎమ్మెల్యే టికెట్ ఆశించట్లేదు: కమెడియన్ పృధ్వీ

వైసీపీ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి తాను ప్రచారం చేయడం లేదని కమెడియన్ పృధ్వీ స్పష్టం చేశారు. ఇటీవల కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్

Samayam Telugu 9 Aug 2018, 9:24 pm
వైసీపీ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి తాను ప్రచారం చేయడం లేదని కమెడియన్ పృధ్వీ స్పష్టం చేశారు. ఇటీవల కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తాజాగా పృధ్వీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 2014లోనూ తాను వైసీపీ తరఫున ప్రచారం చేశానని.. కానీ.. అప్పట్లో ఏ పదవినీ తాను ఆశించలేదని వివరించిన ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న అభిమానంతోనే తాను ఇప్పుడు జగన్ వెంట నడుస్తున్నట్లు వెల్లడించారు.
Samayam Telugu download.


‘వైఎస్ జగన్ కాపులకి న్యాయం చేస్తానని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది..? రైతులకి రుణమాఫీ చేస్తానని 2014లోనే జగన్ చెప్పి ఉంటే.. ఆయన సీఎం అయ్యుండేవారు. అప్పట్లో నేను పార్టీ నుంచి ఏం ఆశించలేదు. ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్యే కాదు కదా.. కనీసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్‌ను కూడా ఆశించడం లేదు. 2014లో చాలా చోట్ల ప్రచారం చేశాను. నన్ను జెండా మోసే సామన్య కార్యకర్తగా మాత్రమే చూడండి. జగన్‌ని సీఎంగా చూడాలనేది నా కోరిక. ఊపిరి ఉన్నంత వరకూ ఆయన వెంటే ఉంటా’ అని పృధ్వీ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.