యాప్నగరం

34 ఏళ్ల తర్వాత లభించిన మృతదేహాలు!

34 ఏళ్ల కిందట గల్లంతైన లారీ ఇటీవల ఇసుక తవ్వకాల్లో బయటపడింది. ఆ లారీతో పాటు మూడు మృతదేహాల అవశేషాలు కూడా బయటపడ్డాయి.

Samayam Telugu 23 Jun 2018, 7:55 pm
34 ఏళ్ల కిందట గల్లంతైన లారీ ఇటీవల ఇసుక తవ్వకాల్లో బయటపడింది. ఆ లారీతో పాటు మూడు మృతదేహాల అవశేషాలు కూడా బయటపడ్డాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 1984లో కురిసిన భారీ వర్షాలకు ఇరుకుల్ల వాగు వంతెన మీదుగా వరద ప్రవహించింది. ఈ సందర్భంగా ఆ వాగు మీద నుంచి వెళ్లిన లారీ వరదలో కొట్టుకుపోయింది.
Samayam Telugu 12331


ఈ ఘటనలో లారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా గల్లంతయ్యారు. అప్పట్లో లారీ కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ఇటీవల వాగులో జరిగిన తవ్వకాల్లో.. లారీ బయటపడిందనే సమాచారం తెలియగానే కేశవపట్నంలో ఉంటున్న మృతుల కుటుంబ సభ్యులు గురువారం తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ను కలిశారు. వాగులో నుంచి లారీని తవ్వి తీసేందుకు అనుమతి కోరారు.

ఈ సందర్భంగా లభ్యమైన అవశేషాలు కేశవపట్నానికి చెందిన దౌలత్ ఖాన్, ముగ్దుంఖాన్, కరీంనగర్‌కు చెందిన కటికె శంకర్‌‌వి గుర్తించారు. దౌలత్ ఖాన్, ముగ్దుం ఖాన్ సోదరులని, వీరు అప్పట్లో పశువులు వ్యాపారం చేసేవారిని బంధువులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజున వీరిద్దరూ సొంత లారీలో పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆ లారీలో ఇద్దరు సోదరులతో పాటు కరీంనగర్‌కు చెందిన కటికె శంకర్, వెంకటస్వామి అనే మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలిపారు. అప్పట్లో వారి గురించి గాలించినా ఆచూకీ లభించలేదని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.