యాప్నగరం

ఏపీ: అగ్రిగోల్డ్ బాధితుల 'న్యాయపోరాట దీక్ష'

ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు.. పోరాటాన్ని ఉధృతం చేశారు అగ్రిగోల్డ్ బాధితులు. తమకు న్యాయం చేయాలంటూ.. గుంటూరులో న్యాయపోరాట దీక్ష చేపట్టారు.

Samayam Telugu 30 May 2018, 3:37 pm
ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు.. పోరాటాన్ని ఉధృతం చేశారు అగ్రిగోల్డ్ బాధితులు. తమకు న్యాయం చేయాలంటూ.. గుంటూరులో న్యాయపోరాట దీక్ష చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన ఏజెంట్లు, ఖాతాదారులు.. దీక్షలో పాల్గొన్నారు. వినూత్నంగా ఉరి తాడు మెడలో వేసుకొని.. నిరసన తెలిపారు బాధితులు. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ ఆందోళన కార్యక్రమం రేపు ఉదయం 8 గంటల వరకు కొనసాగనుంది. తర్వాత బాధితులంతా కలిసి గుంటూరు నుంచి బయల్దేరి.. అగ్రిగోల్డ్ ఆత్మఘోష పేరుతో వెలగపూడికి పాదయాత్ర చేయనున్నారు.
Samayam Telugu Agri Gold


అగ్రిగోల్డ్ బాధితులకు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని కూడా మద్దతు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల్ని వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలిని డిమాండ్ చేశారాయన. తక్షణ ఉపశమనం కింద రూ.3,900 కోట్లు విడుదల చేయాలన్నారు. ఈ కుంభకోణంలో అరెస్టైన ప్రధాన నిందితుడికి కొందరు అధికారులు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. తమ ఆవేదనను ప్రభుత్వవానికి తెలియజేసేందుకే గురువారం పాదయాత్ర చేపడుతున్నామని.. అది కూడా శాంతియుతంగా నిర్వహిస్తున్నామన్నారు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు అజయ్ కుమార్. దీనికి పోలీసులు ఎలాంటి తఅడ్డంకులు సృష్టించొద్దని విజ్ఞ‌ప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.