యాప్నగరం

హైదరాబాద్‌: బిచ్చగాళ్లంతా అక్కడికి తరలాల్సిందే!

హైదరాబాద్ నగరంలో బిచ్చగాళ్లు కనిపించకుండా ఉండేందుకు.. వారందర్నీ చంచల్‌గూడ తరలిస్తున్నారు.

TNN 17 Oct 2017, 12:04 pm
నవంబర్ చివరిలో వారంలో జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిచనున్న ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన1500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నగర వీధుల్లో బిచ్చగాళ్లు కనిపించకుండా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. వారందర్నీ జైళ్ల శాఖ ఆధ్వర్యంలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది.
Samayam Telugu ahead of ges beggars to be rehabilitated
హైదరాబాద్‌: బిచ్చగాళ్లంతా అక్కడికి తరలాల్సిందే!


చంచల్‌గూడ సెంట్రల్ జైలు వెనుక భాగంలో ఉన్న బాలుర అబ్జర్వేషన్‌ హోంను పురుషుల కోసం, దాని పక్కనే ఉన్న భవనాన్ని మహిళల కోసం కేటాయించింది. పురుష బిచ్చగాళ్ల పునరావాస కేంద్రానికి చంచల్‌గూడలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తారు. ప్రిజనర్స్ అగ్రికల్చర్ కాలనీ సూపరింటెండెంట్.. మహిళలకు సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తారు. సోమవారం ఈ విషయమై సర్కారు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ యాచకుల నిర్మూలన చట్టం 1977 ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంటూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బిచ్చగాళ్లందరికీ పునరావాసం ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్ నవంబర్ 28 నుంచి 30 తేదీల మధ్య హెచ్‌ఐఐసీలో జరగనుంది. ఈ సదస్సు ద్వారా భారీగా పెట్టుబడులు రాబట్టాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొనే ప్రతినిధులు ప్రతి అంశాన్ని సునిశితంగా గమనించే వీలుంది. అందుకే సదస్సు ప్రారంభం కావడానికి ముందే.. ప్రభుత్వం బిచ్చగాళ్ల పునరావాసం దిశగా నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.