యాప్నగరం

చంద్రబాబూ.. ఆంధ్రాకు వస్తున్నా కాస్కో: అసద్

చంద్రుడూ ఆంధ్రాకు వస్తున్నా.. మలక్‌పేట వచ్చి సత్తా చూపిస్తానన్నావు. నేనూ ఆంధ్రాకు వస్తా.. నా సత్తా ఏంటో చూపిస్తా.

Samayam Telugu 13 Dec 2018, 5:35 pm
చంద్రబాబూ.. ఆంధ్రాకు వస్తున్నా కాస్కో అంటున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. బాబు ఎన్నికల కోసం తెలంగాణ, హైదరాబాద్ వచ్చినప్పుడు.. తాను ఆంధ్రాకు తప్పకుండా వెళతానంటున్నారు. బుధవారం ఎంఐఎం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన అసద్.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ‘చంద్రుడూ ఆంధ్రాకు వస్తున్నా.. మలక్‌పేట వచ్చి సత్తా చూపిస్తానన్నావు. నేనూ ఆంధ్రాకు వస్తా.. నా సత్తా ఏంటో చూపిస్తా’అంటూ సెటైర్లు పేల్చారు.

కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి రావాల్సిన అవసరం ఉందన్నారు అసద్. ఈ కూటమిని నడిపించేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరైన వ్యక్తని అభిప్రాయపడ్డారు. ఈ కూటమి వస్తే 2019లో నరేంద్ర మోదీ ప్రధాని కాలేరన్నారు అసదుద్దీన్. కేసీఆర్‌లో నిబద్ధత ఉందని.. ఆయన దెబ్బకు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ బడా నేతలు ఓడిపోయారని గుర్తు చేశారు.

అసద్ జగన్‌కు మద్దతిస్తున్నట్లు కూడా ప్రకటించారు. బుధవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన ఏపీలో టీడీపీకి ఘోర పరాజయం తప్పదన్నారుప్రజల్లో చంద్రబాబుపై చాలా వ్యతిరేకత ఉందని.. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం రెండు ఎంపీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనకు మంచి మిత్రుడన్నారు అసదుద్దీన్. తాను కచ్చితంగా ఆంధ్రకు వెళ్లి తీరుతానని.. జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానన్నారు. చంద్రబాబుకు ప్రజా వ్యతిరేకత అంటే ఏంటో చూపిస్తాన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.