విజయవాడ నుంచి ముంబయికి నేరుగా రెండు గంటల్లో చేరిపోయేందుకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ముంబయికి విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ మార్గంలో కొత్త ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని నడపనున్నారు. ఈ మేరకు అశోక్ గజపతిరాజు ట్వీట్ కూడా చేశారు.
‘విజయవాడతో ముంబయిని ఈరోజు అనుసంధానించాం. ఎయిరిండియా కొత్త ఎక్స్ప్రెస్ ఫ్లైట్కి అభినందనలు’ అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే బోయింగ్ 777 విమానానికి అత్యంత తక్కువ వయసు కలిగిన మహిళా కమాండర్గా వ్యవహరిస్తున్న అన్నె దివ్యతో ప్రారంభోత్సవం చేయించినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Vijaywada gets connected to Mumbai today. Best wishes for the new Air India Express flight. pic.twitter.com/g83gE41Tfh — Ashok Gajapathi Raju (@Ashok_Gajapathi) January 19, 2018 The inauguration honours were done by Ms Anne Divya, the youngest woman Boeing 777 aircraft commander. — Ashok Gajapathi Raju (@Ashok_Gajapathi) January 19, 2018
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతం నుంచి ఉన్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా బోయింగ్ 737-800 విమాన సేవలను ప్రారంభించినట్లు మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. కాగా, విజయవాడ నుంచి నేరుగా ముంబయికి చేరుకుంటే.. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా వెళ్లిపోయేందుకు అనుసంధానం ఉంటుంది. ప్రస్తుతం ముంబయి వరకు ఉన్న ఈ సర్వీసును భవిష్యత్తులో దుబాయ్కు పొడిగించే యోచనలో ఎయిరిండియా ఉంది.
ఇదిలా ఉంటే.. గన్నవరం ఎయిర్పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ప్రస్తుత టెర్నినల్ను రికార్డు స్థాయిలో 12 నెలల్లోనే పూర్తిచేశామని చెప్పారు. త్యాగమూర్తులైన గన్నవరం రైతులు భూములు ఇవ్వడం వల్లే మూడేళ్లలో గన్నవరం ఎయిర్పోర్టును ఈ స్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రన్వే పొడిగింపు పనులు పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అన్ని పనులు త్వరగా పూర్తిచేసి గన్నవరం నుంచి అంతర్జాతీయ సేవలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
‘విజయవాడతో ముంబయిని ఈరోజు అనుసంధానించాం. ఎయిరిండియా కొత్త ఎక్స్ప్రెస్ ఫ్లైట్కి అభినందనలు’ అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే బోయింగ్ 777 విమానానికి అత్యంత తక్కువ వయసు కలిగిన మహిళా కమాండర్గా వ్యవహరిస్తున్న అన్నె దివ్యతో ప్రారంభోత్సవం చేయించినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Vijaywada gets connected to Mumbai today. Best wishes for the new Air India Express flight. pic.twitter.com/g83gE41Tfh — Ashok Gajapathi Raju (@Ashok_Gajapathi) January 19, 2018 The inauguration honours were done by Ms Anne Divya, the youngest woman Boeing 777 aircraft commander. — Ashok Gajapathi Raju (@Ashok_Gajapathi) January 19, 2018
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతం నుంచి ఉన్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా బోయింగ్ 737-800 విమాన సేవలను ప్రారంభించినట్లు మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. కాగా, విజయవాడ నుంచి నేరుగా ముంబయికి చేరుకుంటే.. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా వెళ్లిపోయేందుకు అనుసంధానం ఉంటుంది. ప్రస్తుతం ముంబయి వరకు ఉన్న ఈ సర్వీసును భవిష్యత్తులో దుబాయ్కు పొడిగించే యోచనలో ఎయిరిండియా ఉంది.
ఇదిలా ఉంటే.. గన్నవరం ఎయిర్పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ప్రస్తుత టెర్నినల్ను రికార్డు స్థాయిలో 12 నెలల్లోనే పూర్తిచేశామని చెప్పారు. త్యాగమూర్తులైన గన్నవరం రైతులు భూములు ఇవ్వడం వల్లే మూడేళ్లలో గన్నవరం ఎయిర్పోర్టును ఈ స్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రన్వే పొడిగింపు పనులు పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అన్ని పనులు త్వరగా పూర్తిచేసి గన్నవరం నుంచి అంతర్జాతీయ సేవలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.