యాప్నగరం

మీపై నిషేధం ఉంది... సారీ విమానం ఎక్కలేరు!

తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డికి ఈ ఉదయం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చుక్కెదురైంది.

TNN 9 Jul 2017, 8:39 am
తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డికి ఈ ఉదయం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చుక్కెదురైంది. విజయవాడకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఉదయం 6:40 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ట్రూ జెట్ విమానంలో ప్రయాణించేందుకు ఆయన టికెట్ బుక్ చేసుకోగా, మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించలేమని ఆ సంస్థ సిబ్బంది స్పష్టం చేశారు.
Samayam Telugu airport officials not allowed to plane tdp mp jc diwakar reddy at hyderabad
మీపై నిషేధం ఉంది... సారీ విమానం ఎక్కలేరు!


దీంతో చేసేదేమీ లేక జేసీ వెనుదిరిగారు. ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయలో సిబ్బందిపై ఆయన అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జేసీపై పలు విమానయాన సంస్థలు నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. ఘటన జరిగిన రోజు విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు చొరవతో విమానం ఎక్కినా, ఆ తర్వాత జేసీ విమానాశ్రయానికి వెళ్లి విమానం ఎక్కలేకపోవడం ఇదే తొలిసారి.

జూన్ 16 న విశాఖపట్నం నుంచి ఇండిగో విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు జేసీ విమానాశ్ర‌యానికి వ‌చ్చారు. బోర్డింగ్ పాస్ జారీ స‌మ‌యం అయిపోవ‌డంతో సిబ్బంది కౌంట‌ర్ మూసేశారు. అయితే త‌న‌కు బోర్డింగ్ పాస్ ఇవ్వాల‌ని సిబ్బందితో దివాక‌ర్ రెడ్డి వాద‌న‌కు దిగారు. స‌మ‌యం ముగిసింద‌ని, ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని అక్క‌డి వారు చెప్ప‌డంతో ఆయ‌న ఆగ్ర‌హంతో ఊగిపోయారు. బోర్డింగ్ పాస్ ప్రింట‌ర్‌ను విసిరేసి వీరంగం సృష్టించారు. జేసీ వ్య‌వ‌హారంపై ఎయిర్‌పోర్టు సిబ్బంది ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.