ఏకే 47 గన్ మిస్ఫైర్ కావడంతో నెల్లూరు జిల్లా ఏఎస్పీ శరత్బాబు కార్ డ్రైవర్ రమేశ్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. శనివారం రాత్రి తన అధికారిక కారులో జిల్లా కార్యాలయానికి ఏఎస్పీ శరత్బాబు వచ్చారు. ఆయన కారు దిగే సమయంలో వెనక సీట్లో ఉన్న గన్మెన్ కూడా కారులో నుంచి దిగుతున్నాడు. అనుకోకుండా గన్మెన్ నాగేంద్ర చేతిలో ఉన్న ఏకీ 47 మిస్ఫైర్ అయ్యింది. దీంతో బుల్లెట్లు డ్రైవింగ్ సీట్లో ఉన్న రమేశ్ శరీరంలోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో రమేశ్ అక్కడికక్కడే మరణించాడు. ఏఆర్ కానిస్టేబుల్ అయిన రమేశ్ కొంతకాలంగా ఏఎస్పీ డ్రైవర్గా సేవలందిస్తున్నాడు.
అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మార్చురీలో ఉంచారు. అయితే రమేశ్ మృతిపట్ల అతడి బంధువులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇది మిస్ఫైర్ కాదని, గన్మెన్ కావాలనే చంపాడని ఆరోపిస్తున్నారు. మార్చురీ వద్ద ఉన్న బంధువులు ఈ ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు ఇటీవల రమేశ్ను విచారించారని, అందులో భాగంగానే ఈ మృతి ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బెట్టింగ్ కేసులో రమేశ్ను విచారించలేదని జిల్లా ఎస్పీ రామకృష్ణ తెలిపారు. గన్ మిస్ఫైర్ కావడం వల్లే బుల్లెట్లు తగిలి రమేశ్ చనిపోయాడని వివరించారు. బంధువుల కోరిక మేరకు విచారణకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారాన్ని అందజేస్తామన్నారు. మార్చురీ వద్ద రమేశ్ మృతదేహానికి ఎస్పీ నివాళులర్పించారు.
అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మార్చురీలో ఉంచారు. అయితే రమేశ్ మృతిపట్ల అతడి బంధువులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇది మిస్ఫైర్ కాదని, గన్మెన్ కావాలనే చంపాడని ఆరోపిస్తున్నారు. మార్చురీ వద్ద ఉన్న బంధువులు ఈ ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు ఇటీవల రమేశ్ను విచారించారని, అందులో భాగంగానే ఈ మృతి ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బెట్టింగ్ కేసులో రమేశ్ను విచారించలేదని జిల్లా ఎస్పీ రామకృష్ణ తెలిపారు. గన్ మిస్ఫైర్ కావడం వల్లే బుల్లెట్లు తగిలి రమేశ్ చనిపోయాడని వివరించారు. బంధువుల కోరిక మేరకు విచారణకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారాన్ని అందజేస్తామన్నారు. మార్చురీ వద్ద రమేశ్ మృతదేహానికి ఎస్పీ నివాళులర్పించారు.