యాప్నగరం

ఆ ఆల్‌ఖైదా తీవ్రవాదిది హైదరాబాద్?

దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా వాటి మూలాలు హైదరాబాదులో ఉండటం ఆందోళన కలిగించే విషయమే. తాజాగా కశ్మీర్‌లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లో మరణించిన ఇద్దరు అల్‌ఖైదా తీవ్రవాదుల్లో ఒకరిది హైదరాబాద్ అని తెలిసింది.

Samayam Telugu 16 Mar 2018, 1:47 pm
దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా వాటి మూలాలు హైదరాబాదులో ఉండటం ఆందోళన కలిగించే విషయమే. తాజాగా కశ్మీర్‌లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లో మరణించిన ఇద్దరు అల్‌ఖైదా తీవ్రవాదుల్లో ఒకరిది హైదరాబాద్ అని తెలిసింది. ఈ నేపథ్యంలో కశ్మీర్ పోలీసులు తెలంగాణలో అతడి పూర్తి వివరాలను సేకరించడంతో పాటు.. మరెవ్వరికైనా అతడితో సంబంధాలు ఉన్నాయా అనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు.
Samayam Telugu al qaeda militant killed in kashmir was from hyderabad say police
ఆ ఆల్‌ఖైదా తీవ్రవాదిది హైదరాబాద్?


కొద్ది రోజుల కిందట దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా హక్రార్‌లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మహ్మద్ తౌఫిక్(26) హైదరాబాద్‌కు చెందినవాడని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఐసిస్ తీవ్రవాద సిద్ధాంతాలకు ఆకర్షితుడైన తౌఫిక్.. ఉగ్రవాదిగా మారినట్లు పోలీసులు భావిస్తున్నారు.

తెలంగాణలోని బద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరుకు చెందిన తౌఫిక్.. ఏడాది కిందట హైదరాబాదు నుంచి కశ్మీర్ వెళ్లినట్లు తెలిపారు. అక్కడ ఆల్‌ఖైదాతో సంబంధాలున్న అన్సర్ ఘజ్వతుల్ హింద్ (ఏజీయూహెచ్) కూడా ఈ విషయం స్పష్టం చేసిందన్నారు. కాల్పుల్లో చనిపోయిన తౌఫిక్ భౌతిక కాయాన్ని తీసుకోడానికి ఎవరూ రాలేదు. దీంతో, మంగళవారం కశ్మీర్‌లోని బరాముల్లాలో అంత్యక్రియలు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

Read This Story in English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.