యాప్నగరం

శ్రీలంక పేలుళ్లు.. విజయనగరంలో సోదాలు

శ్రీలంక పేలుళ్లు ప్రపంచదేశాలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. పేలుళ్ల నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో ఏపీలోని విజయనగరం ఆస్పత్రిలో బాంబ్ నిర్వీర్య దళం సోదాలు నిర్వహించింది.

Samayam Telugu 23 Apr 2019, 7:30 pm
శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదుల మారణహోమం ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఆదివారం (ఏప్రిల్ 21) ఈస్టర్ సందర్భంగా ఉల్లాసంగా గడుపుతున్న పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబు దాడులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో ఇప్పటివరకూ 320 మంది వరకూ మరణించినట్లు తెలుస్తోంది. శ్రీలంక పోలీసులు.. పేలుడుతో సంబంధం ఉన్న 24 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. పేలుళ్లతో సంబంధం ఉన్న నైజీరియన్‌ను మంగళవారం అరెస్టు చేశారు.
Samayam Telugu vizianagaram
విజయనగరం ఆస్పత్రి


కొలంబో పేలుళ్లపై ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశాయి. న్యూజిలాండ్‌ మసీదుల్లో కాల్పులకు ప్రతీకారంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ కాల్పులకు తెగబడినట్లు శ్రీలంక రక్షణ మంత్రి ఆ దేశ పార్లమెంట్‌లో తెలిపారు.

మరోవైపు.. కొలంబో దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఆయా దేశాల్లోని పలు నగరాల్లో కీలక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

శ్రీలంక పేలుళ్ల నేపథ్యంలో ఇటు ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయనగరంలోని మహారాజా ఆస్పత్రిలో బాంబ్ నిర్వీర్య బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. భద్రతా చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.