యాప్నగరం

తెలంగాణ జలాల్లో.. ఆంధ్ర ‘దెయ్యం చేప’

హైదరాబాద్ సమీపంలోనీ ఈసీ నది జలాల్లో అరుదైన, ప్రమాదకరమైన దెయ్యం చేపను గుర్తించారు. క్యాట్ పిష్ జాతికి చెందిన చేపను తెలంగాణలో గుర్తించడం ఇదే తొలిసారి.

TNN 13 Oct 2017, 11:59 am
హైదరాబాద్ సమీపంలోనీ ఈసీ నది జలాల్లో అరుదైన, ప్రమాదకరమైన దెయ్యం చేపను గుర్తించారు. క్యాట్ పిష్ జాతికి చెందిన చేపను తెలంగాణలో గుర్తించడం ఇదే తొలిసారి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉప్పొంగి ప్రవహించింది. ఈ వరద ప్రవాహాన్ని ఆసరగా చేసుకొని ఇది కృష్ణా నది నుంచి మూసీలో, అక్కడి నుంచి ఈసీలోకి ప్రవేశించిందని భావిస్తున్నారు. సాగు చేసే చేపల్ని తినేసి, రైతులకు నష్టం కలిగించే ఈ చేపలు మత్స్యకారుల వలల్ని నాశనం చేస్తాయి. రంగారెడ్డి జిల్లా చెవేళ్ల మండలం దేవరంపల్లిలో గుండా ప్రవహిస్తోన్న ఈసీ జలాల్లో ఈ చేపను గుర్తించారు. వింత ఆకారంలో ఉన్న ఈ చేపను చూసిన స్థానిక యువకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ చేపను పరిశీలించే క్రమంలో వాడిగా ఉన్న ముల్లుల కారణంగా వారు గాయపడ్డారు.
Samayam Telugu alien devil fish now invades hyderabad
తెలంగాణ జలాల్లో.. ఆంధ్ర ‘దెయ్యం చేప’


మంచి నీటిలో పెరిగే ఈ జాతి చేపలు తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం అరుదు. తెలంగాణ జలాల్లో ఈ చేప ఉనికిని ఇప్పటి వరకూ కనుగొనలేదు. ఇది చేపల్ని తినేయడం వల్ల చేపల సాగులో రైతులకు నష్టం వాటిల్లుతుంది. ఈ జాతి చేపల కారణంగా తెలంగాణలోని మత్స్య సంపద తగ్గిపోయి మత్స్యకారుల జీవనోపాధి తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చేప గతేడాది నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా పల్నాడు ప్రాంతంలోకి చేరింది. అంతకు ముందే 2015లో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాల నుంచి కృష్ణాలోకి వచ్చింది. అత్యంత హానికరమైన ఈ చేప నీరు లేకపోయినప్పటికీ 15 రోజులకుపైగా మనుగడ సాగించగలదు. నీటిలోనే కాకుండా భూమిపైనా ప్రయాణిస్తూ సమీపంలోని జలాల్లోకి ప్రవేశించి అక్కడ తమ సంతతిని పెంచుకోగలదు.

‘కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం వల్ల కృష్ణా డెల్టా రైతులకు ప్రయోజనం చేకూరింది. కానీ పర్యావరణ పరంగా కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలాంటి హానికారక చేప జాతులు గోదావరి జలాల నుంచి కృష్ణా బేసిన్‌‌లోకి రావడం అందులో భాగమే. ఈ డెవిల్ ఫిష్‌ను 2015లో ప్రకాశం బ్యారేజీ వద్ద తొలిసారిగా గుర్తించారు. మత్స్యకారులు రోజూ డజన్ల సంఖ్యలో ఈ దెయ్యం చేపల్ని పడుతున్నారు. గతేడాది ఇది నాగార్జున సాగర్‌లోకి చేరింది. ఇప్పుడు మూసీలోకి ప్రవేశించింది. ఇది కృష్ణా బేసిన్లో తన సంతతిని పెంచుకునే ప్రమాదం ఉంద’ని పర్యావరణ ఉద్యమకారుడు వి. సత్యనారాయణ హెచ్చరించారు.

Krishna-Godavari river interlinking: Alien devil fish now invades Hyderabad https://t.co/s7F7tkhaH7 — TOI Hyderabad (@TOIHyderabad) October 12, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.