హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. కీలకమైన హైటెక్ సీటీ మార్గం ప్రారంభమైంది. దీంతో రెండు కారిడార్లు పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లైంది. ఐటీ కారిడార్కు సంబంధించిన మార్గం కావడంతో సుమారు 4 లక్షల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మార్గంతో సరాసరి రోజూ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య మరో లక్ష వరకూ పెరగవచ్చని అంచనా.
హైటెక్ సిటీ మార్గంలో అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీకి 10 కి.మీ. దూరాన్ని 18 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ మార్గంలో మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయి. అవి.. అమీర్పేటతో పాటు మధురానగర్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నం.5, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్ సిటీ స్టేషన్లు. అయితే.. ప్రస్తుతానికి ఈ స్టేషన్లన్నీ ప్రారంభం కాలేదు.
జూబ్లీహిల్స్ చెక్పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్.. ఈ మూడు స్టేషన్లను ఇప్పుడే అందుబాటులోకి రాలేదు. ఈ మార్గంలో ఎక్కువ మలుపులు ఉన్నాయి. దీంతో పాటు జూబ్లీ చెక్పోస్ట్ నుంచి హైటెక్సిటీ వరకు 5 కి.మీ. మార్గంలో మెట్రో మార్గం సింగిల్ ట్రాక్ ఉంది. అంటే.. ఇక్కడ నుంచి రైలు హైటెక్ సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి ఒకే ట్రాక్లో తిరిగి వెనక్కి వస్తుంది. దీంతో సీఎంఆర్ఎస్ వేగ నియంత్రణ విధించింది.
ఈ 3 స్టేషన్లు అందుబాటులోకి రావడానికి మరికొంత కాలం ఆగాల్సిందేనని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైటెక్ సిటీ రూట్లో కొంత కాలం పాటు ప్రతి 9 నుంచి 12 నిమిషాలకో రైలు మాత్రమే నడపనున్నారు. ప్రస్తుతం ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – అమీర్పేట్ మార్గంలో ప్రతి 6 నిమిషాలకో రైలు నడుపుతున్నారు.
Also Read: హైటెక్ సిటీ మెట్రో ప్రత్యేకతలివే..
గ్రేటర్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైటెక్ సిటీ మెట్రో రైలును తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం (మార్చి 20) ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. అమీర్పేట్ స్టేషన్లో ఉదయం 9.30 గంటలకు గవర్నర్ నరసింహన్ హైటెక్ సిటీ మెట్రో రైలును ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి..
హైటెక్ సిటీ మార్గంలో అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీకి 10 కి.మీ. దూరాన్ని 18 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ మార్గంలో మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయి. అవి.. అమీర్పేటతో పాటు మధురానగర్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నం.5, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్ సిటీ స్టేషన్లు. అయితే.. ప్రస్తుతానికి ఈ స్టేషన్లన్నీ ప్రారంభం కాలేదు.
జూబ్లీహిల్స్ చెక్పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్.. ఈ మూడు స్టేషన్లను ఇప్పుడే అందుబాటులోకి రాలేదు. ఈ మార్గంలో ఎక్కువ మలుపులు ఉన్నాయి. దీంతో పాటు జూబ్లీ చెక్పోస్ట్ నుంచి హైటెక్సిటీ వరకు 5 కి.మీ. మార్గంలో మెట్రో మార్గం సింగిల్ ట్రాక్ ఉంది. అంటే.. ఇక్కడ నుంచి రైలు హైటెక్ సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి ఒకే ట్రాక్లో తిరిగి వెనక్కి వస్తుంది. దీంతో సీఎంఆర్ఎస్ వేగ నియంత్రణ విధించింది.
ఈ 3 స్టేషన్లు అందుబాటులోకి రావడానికి మరికొంత కాలం ఆగాల్సిందేనని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైటెక్ సిటీ రూట్లో కొంత కాలం పాటు ప్రతి 9 నుంచి 12 నిమిషాలకో రైలు మాత్రమే నడపనున్నారు. ప్రస్తుతం ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – అమీర్పేట్ మార్గంలో ప్రతి 6 నిమిషాలకో రైలు నడుపుతున్నారు.
Also Read: హైటెక్ సిటీ మెట్రో ప్రత్యేకతలివే..
గ్రేటర్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైటెక్ సిటీ మెట్రో రైలును తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం (మార్చి 20) ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. అమీర్పేట్ స్టేషన్లో ఉదయం 9.30 గంటలకు గవర్నర్ నరసింహన్ హైటెక్ సిటీ మెట్రో రైలును ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి..