యాప్నగరం

బీజేపీయేతర పార్టీల భేటీ.. రేపు ఢిల్లీకి చంద్రబాబు

సోమవారం ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై జాతీయ స్థాయి నేతల ఫోకస్..

Samayam Telugu 9 Dec 2018, 5:41 pm
బీజేపీయేతర శక్తుల్ని కూడగట్టడంలో దూకుడు పెంచారు చంద్రబాబు. కూటమి కసరత్తు కాస్త కొలిక్కిరావడంతో.. భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసొస్తున్న పార్టీలతో సోమవారం (10-12-2018) కీలక భేటీ నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా అన్ని పార్టీల నేతలతో చంద్రబాబు టచ్‌లోకి వెళ్లారట. దాదాపు అందరూ ఓకే చెప్పడంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కూటమి కూర్పుతో పాటూ భవిష్యత్‌ కార్యాచరణపై జాతీయస్థాయి నేతలు చర్చించబోతున్నారు.
Samayam Telugu babu delhi


చంద్రబాబు టూర్ విషయానికొస్తే.. ఆయన సోమవారం ఉదయం ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఈ నెల 11 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభకానుండటంతో.. టీడీపీ పార్లమెంటరీ భేటీ నిర్వహిస్తున్నారు. ఎంపీలతో కలిసి చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. విభజన హామీలు, తిత్లీ సాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా పోరాడాలని దిశా నిర్దేశం చేయనున్నారు. అనంతరం బీజేపీయేతర పార్టీల సమావేశంలో పాల్గొంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.