యాప్నగరం

నేడే ప్లీనరీ: గులాబీ సంబరానికి అంతా సిద్ధం

తెలంగాణ రాష్ట్ర సమితి పదహారో ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

TNN 21 Apr 2017, 7:46 am
తెలంగాణ రాష్ట్ర సమితి పదహారో ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ లోని కొంపల్లిలో పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. కొంపల్లి మొత్తం గులాబీ మయం అయిపోయింది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలే ఎగురుతున్నాయ్. తెరాస అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. ఈ ప్లీనరీలో మూడేళ్ల పాలనను విశ్లేషించుకోవడంతో పాటూ వచ్చే రెండేళ్లలో ఏం చేయాలనుకుంటున్నారో కూడా ప్రసంగిస్తారు కేసీఆర్. ఈ కార్యక్రమానికి తెరాస మంత్రుల నుంచి ఎంపీపీల వరకు పదవుల్లో ఉన్నవారంతా వస్తారు. మొత్తం 16 వేల మంది వచ్చే అవకాశం ఉంది. ఇక ప్లీనరీ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారు సీఎం. కేటీఆర్ పర్యవేక్షణలోనే సభకు అన్నీ ఏర్పాట్లు జరిగాయి. వేదికను సిద్ధం చేయడం, వసతులు కల్పించడం, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ వంటివన్నీ సమర్థంగా పూర్తిచేశారు.
Samayam Telugu all set for trs plenary today in hyderabad
నేడే ప్లీనరీ: గులాబీ సంబరానికి అంతా సిద్ధం


ప్లీనరీలో తెరాస అధ్యక్షుని ఎంపిక కూడా జరుగుతుంది. మరోసారి కేసీఆర్ అధ్యక్షుడినగా ఎన్నికవుతారు. పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ, మండల కమిటీల నియమకాలకు కూడా ప్లీనరీ ఆమోద తెలుపుతుంది. ఇప్పటికే తెరాసకు 75 లక్షల సభ్యత్వాలు దక్కాయి. ఉదయం పదిన్నరకు సభ ప్రారంభం అవుతుంది. మొదట అమరవీరులకు కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటిస్తారు. స్వాగతోపన్యాసంతో సభ కార్యాక్రమాలు ఆరంభమవుతాయి. సాయంత్రం అయిదున్నర వరకు సభ సాగుతుంది. చివర్లో మళ్లీ తెరాస అధ్యక్షుడు ముగింపు ఉపన్యాసంతో సభ ముగుస్తుంంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.