యాప్నగరం

ఏపీ అసెంబ్లీ ప్రారంభానికి ముహుర్తం రెడీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించేందుకు ముహుర్తం ఖరారైంది.

Samayam Telugu 26 Feb 2017, 2:54 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించేందుకు ముహుర్తం ఖరారైంది. మార్చి 2న ఉదయం 11.25 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించనున్నారు.
Samayam Telugu all set lokesh son of chandrababu to be mlc
ఏపీ అసెంబ్లీ ప్రారంభానికి ముహుర్తం రెడీ


ఆదివారం చంద్రబాబు నాయుడు నివాసంలో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై బాబు పార్టీ నేతలతో చర్చించారు.

ఎమ్మెల్యేలా కోటా నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ ను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని పొలిట్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇతర అభ్యర్థులపై తుదినిర్ణయాన్ని చంద్రబాబుకు కట్టబెట్టారు నేతలు.

ఎమ్మెల్సీగా ఎన్నికైన మరుక్షణమే లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోఫేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఏపీలో ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం వంటి అంశాలపై చర్చించామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

అమెరికాలో తెలుగు వారిపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నట్లు చెప్పిన విప్ కాల్వ శ్రీనివాసులు...దాడులకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు తెలుగువారికి భద్రత కల్పించాలని కేంద్రం సహకారంతో అమెరికాను కోరనున్నట్లు ఆయన చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.