యాప్నగరం

కాసేపట్లో ఏపీ, టీఎస్‌లలో ‘మండలి’ పోలింగ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల శాసనమండళ్లలో ఖాళీ అవుతున్న టీచర్లు, పట్టభద్రుల నియోజకవర్గాల భర్తీకి జరిగే పోలింగుకు

Samayam Telugu 9 Mar 2017, 7:17 am
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల శాసనమండళ్లలో ఖాళీ అవుతున్న టీచర్లు, పట్టభద్రుల నియోజకవర్గాల భర్తీకి గురువారం జరిగే పోలింగుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ జరుగుతోందని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుగు రాష్ట్రాల ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ వెల్లడించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
Samayam Telugu all set to mlc polling in ap and ts on thursday
కాసేపట్లో ఏపీ, టీఎస్‌లలో ‘మండలి’ పోలింగ్


తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల కోటాలో మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ నియోజవర్గం పరిధిలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఏపీలోని ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు నియోజకవర్గం పరిధిలో 9మంది, కడప-కర్నూలు-అనంతపురం నియోజకవర్గ పరిధిలో 10మంది బరిలో ఉన్నారు.

ఏపీ పట్టభద్రుల సెగ్మెంట్ శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం స్థానానికి 30 మంది బరిలో నిలిచారు. కడప-కర్నూలు-అనంతపురం స్థానానికి 25 మంది ఉండగా ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు నియోజకవర్గానికి 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ఏపీలో40,772 మంది, తెలంగాణలో ఒక్కస్థానానికి 23,789 మంది ఓటర్లు తమ
ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా, ఏపీలో 1,192, తెలంగాణలో 126 పోలింగు కేంద్రాల ఏర్పాటు చేశారు.

అయితే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజాగా ఓటు హక్కును నమోదు చేసుకున్నవారే అర్హులని ఆయన తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఎన్నికల సంఘం గుర్తింపు వాటిల్లో ఏదో ఒకటి ఉన్నా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని భన్వర్ లాల్ చెప్పారు. ఏలాంటి గుర్తింపు కార్డులు లేకపోయినా విద్యార్హతల ఒరిజినల్‌ ధ్రువపత్రాలున్నా అనుమతిస్తారని ఆయన వివరించారు. దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఎవరూ మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని గుర్తు చేశారు.

ఓటు వేసేవారు బ్యాలెట్ పత్రంలో కేవలం అంకెలు మాత్రమే వేయాలి. ప్రాధాన్యత క్రమంలో కూడా సంఖ్యాపద్ధతినే పాటించాలి. మొదటి ప్రాధాన్యం లేని ఓటు చెల్లదు.

తెలుగు రాష్ట్రాల్లో పది స్థానిక సంస్థల నియోజకవర్గాలకు ఏడు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన మూడు స్థానాలకు ఈ నెల 17న పోలింగు నిర్వహించి..వాటి..ఓట్ల లెక్కింపు ఫలితాలు 20న ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.