యాప్నగరం

అమరావతి బాండ్ల లిస్టింగ్‌.. రేపు ముంబైకి చంద్రబాబు

అమరావతి కేపిటల్ బాండ్లను సోమవారం బీఎస్‌ఈలో లిస్టింగ్ చేయబోతున్నారు. ముంబైలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు స్వయంగా హాజరవుతున్నారు.

Samayam Telugu 26 Aug 2018, 9:04 pm
అమరావతి కేపిటల్ బాండ్లను సోమవారం బీఎస్‌ఈలో లిస్టింగ్ చేయబోతున్నారు. ముంబైలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు స్వయంగా హాజరవుతున్నారు. బాబు సెరిమోనియల్ బెల్ మోగించిన తర్వాత బాండ్లను ట్రేటింగ్‌కు వెళతాయి. కేపిటల్ బాండ్లకు మంచి ఆదరణ రావడంతో రిటైల్ బాండ్ల విడుదలకు కూడా ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు జరుగుతోందట. చంద్రబాబుతో పాటూ మంత్రులు యనమల, నారాయణ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, సీఆర్డీఏ అధికారులు కూడా ముంబైకి వెళుతున్నారు.
Samayam Telugu Stock


లిస్టింగ్ తర్వాత సీఎం చంద్రబాబు పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశంకానున్నారు. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, మాజీ ఛైర్మన్ రతన్ టాటా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. గోద్రేజ్ ఎండీ నడియార్.. మహేంద్ర వరల్డ్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్ సీవోవో శ్రీవాత్సవ.. స్క్వేర్ గ్రూప్ ఛైర్మన్ బాలన్.. ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళంతో పాటూ మరికొన్ని కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. వీరితో ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.